బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–పిల్లల మాంద్యం

Details_

    మేము ఉద్యొగరీత్యా 1983 లో మహరాష్ట్రలోని వరణ్ గాం వెళ్ళాము.అప్పటిదాకా మా అమ్మాయి పూణే లో కాన్వెంట్ లో చదివేది. అక్కడకు వెళ్ళిన తరువాత, కేంద్రీయ విద్యాలయం లో చేర్చాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సౌకర్యంగా ఉండేటట్లు, చాలా మారుమూల ప్రదేశాల్లో ఈ స్కూళ్ళు తెరిచారు. ఇక్కడదాకా బాగానేఉంది. ఆ స్కూల్లో ప్రవేశం, మామూలుగా అయితే కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే ఉండేది. అయినా పాఠశాల నడవాలంటే, పిల్లలు కూడా ఉండాలిగా, అందువలన బయటివారికి కూడా ప్రవేశం ఇచ్చేవారు.

    ఎంత చెప్పినా కాలనీ కదండీ, అక్కడ ఉండే మా ఫాక్టరీ వాళ్ళు ఒకసారి వచ్చేరంటే ఓ పది, పదిహేను ఏళ్ళు, ఎలాటి బదిలీలూ లేకుండా ఉండిపోయేవారు. దానితో, ఈ కేంద్రీయ విద్యాలయంలో, పరిస్థితి ఎలా వచ్చిందంటే, విద్యార్ధుల సంఖ్య ఏడాది,ఏడాది కీ తగ్గిపోవచ్చింది.ఒక ఏడాది, ఇంక స్కూలు మూసేయవలసివస్తుందేమో అన్నదాకా వచ్చేసింది. చాలా మంది బయటవాళ్ళు, రాష్ట్ర సిలబస్సు స్కూల్లోనే చేర్చేవారు( అక్కడ సిలబస్ కొంచెం తేలికగా ఉంటుందని).

    స్కూలు నడపాలని,మావాళ్ళందరూ, పిల్లలు పుట్టించడమే ధ్యేయంగా పెట్టుకోలేరుగా !! ఇలాటి ఒకానొక సందర్భంలో, మా ప్రక్కన ఒక కేంద్రీయ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ గారు ఉండేవారు, ఒక రోజున మా ఇంటావిడ, ఆయన భార్యని అడిగింది–” భాయ్ సాబ్ కహా హై?“అని . దానికి జవాబుగా ఆవిడ అన్నారూ ” పేరెంట్స్ కో ఇఖట్టా కర్నేకేలియే గయే, బచ్చేకో పైదా కర్నా హైనా !!”…..

    ఈ వేళ సాక్షిలో ( డిటైల్స్ మీద నొక్కండి) వచ్చిన వార్త చదవగానే ,పాతికేళ్ళ క్రితం జరిగిన సంగతి గుర్తుకొచ్చింది !! ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ స్కూళ్ళ ధర్మమా అని మన ప్రభుత్వ పాఠశాలలు ఇంక మూసివేయాల్సిన పరిస్థితి తొందర్లోనే రావొచ్చు. ఇక్కడ సంగతి ఆర్ధిక మాంద్యం బదులుగా పిల్లల మాంద్యం అనాలేమో !!

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు

   నిన్న నెను పోస్ట్ చేసిన బ్లాగ్గు గురించి, సాహితి
గారు వివరణ ఇచ్చారు. నాకు వచ్చిన మెయిల్ ఏదో అందరికీ ఉపయోగిస్తుంది కదా అనే ఉద్దేశ్యం తో, నా బ్లాగ్గులో పెట్టాను. క్షంతవ్యుడిని. ఒక్కటి మాత్రం నిశ్చయించుకున్నాను–నాకు ఏదైనా అనుభవం అయితేనే ఇటుపైన పోస్ట్ చేస్తాను, ఇలాటి హొక్స్ మెయిల్స్ ఇంక ఎప్పుడూ పెట్టకూడదనీ. అయినాఒకసారి చేతులు కాలిన తరువాతే కదా తెలిసేది. సాహితి
గారూ ధన్యవాదములు,
నన్ను జాగరూకుడిని చేసినందుకు.

   ఈ వారం రోజులూ చాలా బ్రహ్మాండంగా గడిచిపోయాయి. మా ఫ్లాట్ కి ఎదురుగా ఇదివరకు ఎవరొ అద్దెకుండేవారు. క్రితంవారం ఆ ఫ్లాట్ ఓనర్స్ హైదరాబాద్ నుండి వచ్చారు. వారు రావడానికి రెండు మూడు రోజులనుండీ, ఏవేవో సామాన్లు రావడం మొదలెట్టాయి. క్రిందటి సోమవారం, ఆ ఫ్లాట్లోకి, యజమాని అనుకుంటా ఒకాయన వచ్చారు. వారు, రాజమండ్రీ వాస్తవ్యులే, ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈవేళ ఆయన అరవయ్యో జన్మదినం, ఈ లోపులో ఆవిడ ఋషిపంచమి నోము చేసికున్నారు, లక్షవత్తుల నోము చేసికోవడానికి ముందుగా ఈ ఋషిపంచమి నోము చేసికోవాలట.ఈ వారం రోజులలోనూ,హోమాలూ,జపాలూ, గృహశాంతీ, రుద్రాభిషేకం, దానాలూ, సత్యనారాయణ వ్రతం చేశారు.

   పిఠాపురం నుండి వేద పండితులు తొమ్మండుగురు వచ్చారు. వారు ప్రతీరోజూ, ప్రొద్దుట ఏడు గంటలనుండి, సాయంత్రం దాకా హోమాలూ, వేద పఠనమూ, అబ్బ ఈ వారంరోజులూ ఎంత శ్రవణానందం గా ఉందో చెప్పలేము. వారి ఉఛ్ఛారణా, పలుకులో స్పష్టతా, శ్రధ్ధా, భక్తీ చూస్తూంటే, మేమెంత అదృష్టవంతులమో అనిపించింది, వాటన్నింటినీ వినడానికి. ఏదో డబ్బు ఇచ్చేరుకదా అని చేసేయడం కాకుండా, ఆ కార్యక్రమానికి ఓ పవిత్రత తెచ్చారు.

   మేము ఎంత డబ్బు ఇచ్చినా ఇలాటి వాతావరణం పూణే లో తేలేముకదా.మేము ఇక్కడకు ( రాజమండ్రీ) కి వచ్చిన ఉద్దేశ్యం , ఈ కార్యక్రమంతో పూర్తిగా అయినట్లే. మేము ఎక్కడనుండో రావడం ఏమిటీ,గోదావరి గట్టున ఉండడం ఏమిటి, మాకోసమే అన్నట్లుగా హైదరాబాద్ లో ఉండే వారు, మేము పూణే కి తిరిగి వెళ్ళేలోపలే, ఇలాటి కార్యక్రమం చేయడమేమిటి, ఇదంతా మేము ఎప్పుడో చేసికున్న పుణ్యం అనుకుంటా.

   ఈ వేళ్టి కార్యక్రమంలో, ఆ పండితులు మంత్రపుష్పం చెప్పారండీ, అబ్బ వర్ణించలేను, ఎప్పుడో నా చిన్నప్పుడు, మా తాతగారి ఊరు ముక్కామల ( కోనసీమ) వెళ్ళినప్పుడు, మా బాబుల్లా పెదనాన్నగారు (ప్రభుత్వం వారిచే సన్మానించబడిన వేద పండితులు), వారి ఇంటి అరుగు మీద శిష్యులచెత చెప్పించేవారు–అది గుర్తుకొచ్చి పులకరించిపోయాను.

   శుభ్రంగా భోజనం చేశాము.హాయిగా క్రింద కూర్చొని!! అక్కడకొచ్చిన వారి చుట్టాలలో ఒకాయన మా నాన్నగారి దగ్గర చదువుకున్నారుట, ఆయననీ , అమలాపురం లో మాఇంటినీ గుర్తుచేసికున్నారు. భోజనాలు వడ్డిస్తుంటే, మా చిన్నప్పటి నేతి జారీలూ, పులుసు గోకర్ణాలూ గుర్తు చేసికున్నాము. ఇప్పటి తరానికి, అవేమిటో, ఎలా ఉంటాయో కూడా తెలియదు. మేము ఈ వారం రోజులూ ఆస్వాదించిన అలౌకికానందం మీ అందరితోనూ పంచుకోవాలనే ఈ పోస్ట్.

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–AIDS awareness

ఈ వేళ నాకు ఒక మెయిల్ వచ్చింది. అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని క్రింద కాపి చేశాను.

Don’t avoid, Pls read this mail)
FROM Arvind Khamitkar , I.A.S, Director of Medical
& Research Div, Chennai

Dear Friends,

A few weeks ago, in a movie theatre, a person felt
something poking from her seat..
When she got up to see what it was, she found a
needle sticking out of the seat with a note attached saying

‘You have just been infected by
HIV’.

The Disease Control Center (in Paris ) reports many similar
events in many other cities recently. All tested needles were HI V Positive.

The Center also reports that needles have been found
in cash dispensers at public banking machines. We ask everyone to use extreme caution when faced with
this kind of situation. All public chairs/seats should be inspected with vigilance and caution before use. A careful visual inspection should be enough. In addition, they ask that each of you pass this message along to all members of your family and your friends of the potential danger.

Recently, one doctor has narrated a somewhat similar
instance that hppened to one of his patients at the Priya Cinema in Delhi … A young girl, engaged and about to be married in a couple of months, was pricked while the movie
was going on. The tag with the needle had the message

‘Welcome to the World of HIV family’.

Though the doctors told her family that it takes about 6
months before the virus grows strong enough to start
damaging the system and a healthy victim could survive about 5-6 years, the girl died in 4 months, perhaps more because of the ‘Shock thought’…
We all have to be careful at public places, rest God help! Just think about saving a life by forwarding this message. Please, take a few seconds of your time to pass along.

With Regards, Arvind Khamitkar ,
I.A.S, Director of Medical & Research Div, Chennai.

Rather than forwarding irrelevant mails, kindly pass
this to every one.
Probably ur mail can help to save his/her life

బాతాఖాని -లక్ష్మిఫణి ఖబుర్లు-కోనసీమ

Details_

కోనసీమ లో పొలాల్లో. కాలవల ప్రక్కన ఇళ్ళుంటే ఎలా ఉంది?డిటైల్స్ మీద నొక్కండి

బాతాఖాని-లక్ష్మిఫణి ఖబుర్లు–గృహ ఋణాలు

    ఇదివరకటి రోజుల్లో అయితే చేతిలో డబ్బులుంటేనే ఇల్లు కట్టడం మొదలుపెట్టేవారు,ఇపుడు అలాగ కాదుగా, ఎక్కడ చూసినా ప్రెవేటు బ్యాంకులూ, ప్రభుత్వ బ్యాంకులూ, అదరగొట్టేస్తున్నారు–మేమిస్తామంటే మేమిస్తాము ఋణాలూ అంటూ. ఒక్కఫోన్ చేయగానే, ఓ మార్కెటింగ్ ఎక్జిక్యుటివ్ మన ఇంటికి వచ్చేస్తాడు.అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. మన నాన్న ఇల్లు కట్టడానికి 30 ఏళ్ళు పట్టింది, చూడు నేనైతే ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది కల్లా ఓ ఇంటి వాడినైపోయాను అనుకుంటాడు.

    మన చేతికొచ్చే జీతాన్ని బట్టి ఏవేవో లెఖలు కట్టి, మనకొచ్చే అప్పూ, అది ఎన్ని సంవత్సరాల్లో కట్టాలీ, దాని ఇ.ఎం.ఐ ఎంతా, అన్నీ లెఖ్ఖ కట్టేసి, ఏవేవో కాగితాల మీద, ఓ నలభై సంతకాలు చేయించి, వాడి దారిన వాడు పోతాడు. మనం ఏదో బిల్డర్ ని పట్టుకుని, ఓ రెండు/మూడు బెడ్రూం ల ఫ్లాట్ మన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ కాగితాలు, మనం పూర్తిగా చూసే లోపలే బ్యాంక్ వాడు, గెద్దలా తీసికుపోతాడు.మనం ఏ ఇరవైయేళ్ళో, పాతికేళ్ళో డబ్బులు కడుతూండడమే.

ఓ అయిదారేళ్ళు పోయిన తరువాత, అదృష్టం కొద్దీ మనకి ఏమైనా డబ్బు చేతికి వస్తే, పోనీ మనం చేసిన అప్పులో కొంత భాగం తీరుద్దామని బ్యాంకు కి వెళ్తే, వాడు అవీ ఇవీ లెఖ్ఖ కట్టి ఎదో చెప్తాడు. చూస్తే మనం ఇన్నాళ్ళూ కట్టిన ఈ.ఎం.ఐ లు చాలా భాగం వడ్డీ క్రిందే జమ చేసికున్నట్లు తేలుతుంది.

    అదే మనం పనిచేసే కార్యాలయంలో ( కేంద్ర ప్రభుత్వ) ఇదే అప్పు తీసికుంటే ఎలా ఉంటుందో చూడండి. నాకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల గురించి అంతగా తెలియదు. మన కొచ్చే జీతానికి, మనం ఎంత అమౌంట్ కి అర్హులో చెప్పి, ఓ నెలరోజుల్లో మనకి డబ్బు ఇస్తారు. సామాన్యంగా ఈ ఎచ్.బి.ఏ ( హౌస్ బిల్డింగ్ ఎడ్వాన్స్ ) గురించి,అన్ని ఆఫీసుల్లోనూ డిసెంబర్ లో పేర్లు( అప్పు కావలిసిన వారివి) అడుగుతారు. అంటే ఆ ఆర్ధిక సంవత్సరం పూర్తి అయెలొపల, వాళ్ళకి ఇచ్చిన గ్రాంటులు అన్నీ పూర్తి చేయాలి కనుక.

    మనకు మిగిలిన సర్వీసును బట్టి మన వాయిదాలు నిర్ణయించుకోవచ్చు, అది మనజీతంలోంచే తీసికుంటారు. అందువలన, కట్లు పోగా చేతికి వచ్చిన దానిలోనే మనం గడుపుకుంటాము ” పిండి కొద్దీ రొట్టె” అన్నట్లుగా. ప్రభుత్వం వారు ఇచ్చే అప్పు ముందర అసలు, అది పూర్తి అయిన తరువాతే వడ్డి తీసికుంటారు, ఏ కారణం చేతైనా, మనం సర్వీసులో ఉండగా మన అప్పూ, వడ్డీ పూర్తి అవకపోయినా ఫర్వాలెదు, రిటైర్మెంట్ సమయంలో మనకొచ్చే డబ్బుల్లో, ఇవన్నీమినహాయించుకుని, మిగిలినదే ఇస్తారు.

ఈ మధ్యలో అదృష్టం కొద్దీ కొంత అప్పు తీర్చడానికి నిశ్చయించుకున్నా,అది మన అస్సలు లోకే జమ చేసికుంటారు. బ్యాంక్ వాళ్ళ లాగ వడ్డీ క్రింద కాదు. అందువలన ఈ పోస్ట్ చదివేవారిలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ,లేక వారింట్లో ఎవరైనా సంబంధిత వ్యక్తులెవరైనా ఉన్నా, వారిని ఓ “ఇంటివాడు” గా చేయండి.

ఊరికే ఈ బ్యాంకు ల వాళ్ళ తీపి తీపి మాటలు వినకుండా, హాయిగా మీకు తిండి పెడుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వాళ్ళని ఓ ఇల్లు కూడా కట్టిపెట్టమనండి !! సర్వే జనా సుఖినోభవంతూ !!

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–UTI & PAN Card

    ఈ రోజుల్లో పాన్ కార్డ్ అనేది మన జీవితం లో ఒక విదదియరాని అనుబంధం అయిపోయింది. ఇల్లు కొనుక్కోవాలంటే కావాలి, డీమాట్ అకౌంట్ కి కావాలి,బ్యాంక్ అకౌంట్ కి కావాలి. అవసరంలేని చోటు కనపడడంలేదు.అది పొందడానికి అంత కష్టపడఖర్లెదు. కానీ, దానిలో ఏదైనా సవరింపులు చేయాలంటేనే వస్తుంది తంటా.

    ఆడపిల్లలు వివాహం అయిన తరువాత ఇంటిపేరు మారుతుంది కదా. వీళ్ళేమో పాన్ కార్డులు వివాహానికి ముందర తీసికొని ఉంటారు, ఇంటి పేరు మార్చాలంటే మళ్ళీ మన కార్డుని ప్రభుత్వం వారికి తిరిగి ఇచ్చేసి, దానిలోనే మార్పు చేయించాలిట. పోనీ ఈ గొడవంతా ఎందుకూ, కొత్త కార్డ్ కి అప్లై చేస్తే పోతుందిగా, అనుకుంటే, అబ్బే ఒక కార్డ్ ఉండగా ఇంకో కార్డ్ జారీ చేయరుట .ఇవన్నీ గత 20 ఏళ్ళలోనూ వచ్చిన రూల్స్. నాకొకటి అర్ధం అవదు–ఎలాగూ కొత్త పేరు ( ఇంటిపేరు) మీదే కార్డ్ అడుగుతున్నాము కదా, పాతది క్యాన్సిల్ చేసి ఇంకోటి ఇవ్వొచ్చుకదా.ఎలాగూ వాళ్ళు చేసేది చివరకు అదే !

    ఏది ఎలాగున్నా, ఈ వ్యవహారాలన్నీ మన ప్రభుత్వం వారు యు.టి.ఐ కి ఇచ్చారు చేయమని, కొత్తది ఇవ్వవలసినా, పాతది మార్పులు చేయవలసినా. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, పని చేస్తున్న ఆఫీసులో ఎవడో ఏజెంట్ ఉంటాడు, ఇలాంటి చిల్లర పనులన్నీచేయడానికి, ఈ పిల్లలకి టైముండదు, శలవు దొరకదు. అందువల్ల ఈ ఏజెంట్లు అనే ప్రాణి మీదే ఆధార పడాలి. వాడు వీళ్ళ పాన్ కార్డ్ తీసికొని, దాని ఫొటోకాపీ ఒకటి వీళ్ళకి ఇచ్చి, ఏవేవో ఫారం ల మీద సంతకాలు పెట్టించుకుని, ” మీకేం భయం లెదు మేడం , మీ పాన్ కార్డ్ ఇంటిపేరు మార్చి, పదిహెను రోజుల్లో వచ్చేస్తుందీ ” అని భరోసా ఇచ్చేస్తాడు. సదరు ఏజెంట్ ఈ అప్లికేషనూ, సంబంధిత డాక్యుమెంట్లూ ( అంటే పెళ్ళి ధృవపత్రాలూ వగైరా) తీసికుని ఆ ఊళ్ళో ఉన్న యు.టి.ఐ ఆఫీసులో ఇచ్చి ఓ రసీదు తీసికొని ఇచ్చేస్తాడు. వాడి పని అంతదాకానే.

    మనం ఓ నెలదాకా ఆగి, అప్పటిదాకా మన పాన్ కార్డ్ రాలెదని ఇంక ఖంగారు పడడం మొదలెడతాము. ఆ ఏజెంట్ ని ఎప్పుడడిగినా, ఇదిగో చూస్తా, అదిగో చూస్తా అంటాడే కానీ ఫలితం శూన్యం. ఆ కార్డొచ్చేదాకా మనం ఎలాటి ఆర్ధిక సంబంధిత కార్యక్రమాలూ చేయలెము, ఇదెప్పుడొస్తుందో భగవంతుడే దిక్కు.. ఇదిగో ఇలాటి పరిస్థితి వచ్చిన తరువాత, మా అబ్బాయీ, కోడలూ నా దృష్టికి తెచ్చారు. అప్పటికి ఆరు నెలలు పుర్తి అయ్యాయి.

    నేను రిటైర్ అయి ఉన్నాను, కావలిసినంత ఖాళీ సమయం, పనెమీ లేదు, ఈ వ్యవహారం ఏదో తేల్చుకుందామని, మా కోడలిచ్చిన డాక్యుమెంట్లు అన్నీ తీసికుని, ముందుగా పూణే లో ఉన్న యు.టి.ఐ ఆఫీసుకెళ్తే, నా గొడవంతా విని, ఆన్ లైన్ లో చెక్ చేసి, అవునూ, ఇంకా కొత్తది తయారు అవలెదూ అన్నాడు. ఆ విషయం వాడు చెప్పేదేమిటి, రాలెదు కాబట్టే వీళ్ళదగ్గరకు వచ్చాను. అలాగ ఓ నెల గడిపాడు,నా గోల భరించలెక చివరకు అస్సలు సంగతి చెప్పాడండి. వీళ్ళ పనేమిటంటే మనం అందరం ఇచ్చిన అప్ప్లికేషన్లు అన్నీ నవీముంబైలో ఉన్న యు.టి.ఐ హెడ్డాఫీసుకి పంపడం వరకేట.అది ఎప్పుడు వస్తుందో అవన్నీ వాళ్ళు ఏమీ చెప్పలెరుట !! అంటే వీళ్ళుకూడా ఓ కొరియర్ సర్వీసులాగేనన్నమాట.

    ఇంక ఇదికాదు సంగతీ అని రోజువిడిచి రోజు ముంబైలో ఉన్న హెడ్డాఫీసుకి ఫోన్లు చేయడం మొదలెట్టాను. మొత్తానికి పట్టువీడని విక్రమార్కుడి లాగ, ఆ ముంబై ఆఫీసువాళ్ళని ఊదరగొట్టేసి, చివరకు, వాళ్ళు ” మీ కార్డు తయారయ్యింది బాబొయ్” అని చెప్పేదాకా వదలలెదు.దానిని కోరియర్ లో పంపాము అన్నాక, వాటి నెంబరూ తీసికొని, చివరకు చేతికి వచ్చిందండి. అప్పటికి పట్టిన సమయం--రెండురోజులు తక్కువగా తొమ్మిది నెలలు !!

    పై విషయమంతా ఎందుకు వ్రాశానంటే, ఎవరైనా ఇలాటి పరిస్థితిలో చిక్కుకుంటే, ఊరికే మీ ఊళ్ళొ ఉన్న యు.టి.ఐ ఆఫీసువాళ్ళని అడిగితే లాభం లేదు. వాళ్ళు ఒట్టి కొరియర్లు మాత్రమే. ఓ పదిహేను రోజులు ఆగి, నవీముంబైలో ఉన్న హెడ్డాఫీసు వాళ్ళ వెనుక పడి, వాళ్ళ మెదడు తినేయండి .మీ పని అవుతుంది !!మరీ నాలాగ తొమ్మిది నెలలూ ఆగకండి, సరేనా ?

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు –ICICI Health Policy

   మీకెవరికైనా ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ వాళ్ళ ఆరోగ్య భీమా పాలసీ తో పరిచయం ఉందా? చాలా మందికి ఉండిఉండొచ్చు. మాకు కేంద్ర ప్రభుత్వం వారి ఒక సీ.జీ.ఎచ్.ఎస్ అని ఒక ఆరోగ్య పథకం ఉంది. రిటైర్ అవగానే ఓ 18 వేలు కట్టేస్తే నాకూ, నా భార్యకూ జీవితాంతం ఆరోగ్య భీమా ఉంటుంది. ఏదో పేద్ద ఉధ్ధరించేద్దామని, అది తీసికోకుండా, ఈ ప్రెవేట్ బ్యాంక్ వాళ్ళది పుచ్చుకున్నాము;. వాడెవడో ఏజెంట్ వచ్చి, నా చేత సంతకాలు పెట్టించాడు, క్రెడిట్ కార్డ్ ఉందికాబట్టి దాంట్లోంచి కట్ చేసికుంటారూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ పదిహేను రోజుల తరువాత, ఓ పాలసీ, ఓ కార్డూ వచ్చాయి. ఈ లోపులో నా క్రెడిట్ కార్డ్ మీద ప్రతీ నెలా,850 రూపాయలు; ఈ.ఎం.ఐ. కట్టేవాడిని. అంతా బాగానే ఉందీ నాక్కానీ, మా ఇంటావిడక్కానీ ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చినా, వీళ్ళిచ్చిన కార్డ్ పుచ్చుకొని హాస్పిటల్ కి వెళ్తే, మనం ఏమీ డబ్బు కట్టఖర్లెదు కదా అని అనుకున్నాను.

   ;కట్టిన రెండో ఏడు, మా ఇంటావిడకు ఏదో గైనిక్ ఆపరేషన్ (చిన్నదే) చేయించవలసి వచ్చి, పూణే లో వీళ్ళిచ్చిన హాస్పిటల్ లో చేర్పించాను.ఆ భీమా వాడికి ఫోన్ చేస్తే, అప్రూవల్ రావడానికి సమయం పడుతుందీ, అందువలన, ముందు ఆపరేషన్ చేయించుకుని, ఆ తరువాత బిల్లులూ అవీ జతపరచి పంపితే, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారూ, అన్నాడు. సరే నని, హాస్పిటల్ లో మా పని పూర్తి చేసికుని, డాక్టర్ చేత సంతకాలూ అవీ చేయించి, బిల్లులు అన్నీ వాళ్ళకి పంపాను.

ఓ రెండు వారాల తరువాత,నేను పంపిన బిల్లులు, అన్నీ ఒక ఫైల్ లో పెట్టి దానికి ఓ ఉత్తరం జతచేసి, నా బిల్లు అనుమతించబడద ని ఓ ఉత్తరం వ్రాశారు !!

కారణం ఏమిటయ్యా అని చదివితే, వాళ్ళు జారీ చేసిన పాలసీ రూల్ అదేదో వ్రాశాడు..ఫలానా, ఫలానా క్లాజు ప్రకారం, నేను పాలసీ తీసికొన్న రెండేళ్ళలోపు  ఫలానా రోగానికి కానీ, సర్జెరీ కి కానీ నా బిల్లు అనుమతించబడదూఅని ఆ ఉత్తరం సారాంశం.

   వాళ్ళిచ్చిన భీమా పాలసీ తీసి చదువుదామని చూస్తే దానిలో మన నేకెడ్ ఐ కి కనిపించనంత చిన్న అక్షరాలతో ఓ పదో పదిహెనో రోగాల లిస్ట్ ఇచ్చాడు. వాటిని చదవడానికి ఓ భూతద్దం కొనుక్కుని చదవ వలసి వచ్చింది. దాంట్లో ఉన్న లిస్ట్ ప్రకారం మామూలుగా వచ్చే రోగాలు వేటికీ, పాలసీ తీసికున్న రెండేళ్ళలో డబ్బు ఇవ్వరుట!! మనకెమైనా రోగం వచ్చినా అది రెండేళ్ళ తరువాతే రావాలన్నమాట.ఈలోపుగా అవసరం వస్తే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడమే

   ఇదేమిటిరా భగవంతుడా అని, వాళ్ళకి వ్రాస్తే, జవాబు ఇవ్వడం వాళ్ళకి అలవాటు లేదుగా, ఎన్నిరోజులైనా, ఫోన్ కి జవాబివ్వరు, ఉత్తరానికీ, సమాధానం ఇవ్వరూ, ఇలా కాదని, నా గొడవంతామనీలైఫ్ అని ఒక ఇంగ్లీష్ మాగజీన్ కి పంపాను. అక్కడశ్రీమతి సుచెతా దలాల్ ( హర్షద్ మెహతా కెసు బయటపెట్టినావిడ నా ఉత్తరాన్ని ఐ.సి.ఐ.సి.ఐ వాళ్ళకి పంపి, వారంలోపుగా సమాధానం పంపాలని, నా లెటర్ పబ్లిష్ చేశారు. ఆ వారం లో ఆ భీమా కంపెనీ నుండి ఎవడో ఫోన్ చేసి–ఏవేవో కారణాలు చెప్పి చివరకు నాకు ఏమీ దొరకదని తేల్చాడు.

   ఈ ప్రకరణానికి కొసమెరుపేమంటే  రెండేళ్ళూ పూర్తయిందని, వాళ్ళ ఏజెంట్ మళ్ళీ వచ్చాడు నాదగ్గరకు, రిన్యూ చేస్తారా అంటూ, వాడిని పట్టుకుని కడిగేశాము, పైగా ఇంకో విషయమేమంటే, ఇప్పటిదాకా కట్టినదానికి డబుల్ కట్టాలిట.  అప్పటికి రెండేళ్ళకీ 16000/- కట్టాము. మేము కనుక రిన్యూ చేసికోకపోతే, ఆ డబ్బంతా వేస్ట్ అన్నాడు.అంటే వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతీ రెండేళ్ళకీ రెట్టింపు చొప్పున జీవితాంతం కడుతూఉంటే , మనకి వాళ్ళు భీమా చేస్తారన్నమాట !!

   నోరు మూసుకొని, మావాళ్ళ ఆఫీసుకెళ్ళి 18000/- కట్టి సి.జి.ఎచ్.ఎస్ వాళ్ళ స్కీమ్ లో చేరాను.ఇదంతా ఎందుకు వ్రాశానంటే, మన దగ్గరకి వచ్చే ఈ బ్యాంకు వాళ్ళ భీమా ఏజెంట్లు, అన్ని విషయాలూ పూర్తిగా చెప్పకుండా, చేతిలో కైలాసం చూపించి, మనచేత ఓ పాలసీ తీయించేస్తారు. ఆ తరువాత ఏవేవో రూల్స్ చెప్పి, మనకివ్వవలసిన డబ్బు మనకివ్వరు. ఆ పాలసీలో కూడా వ్రాసినది చదవడానికి ఓ భూతద్దం కొని పెట్టుకోండి. పారా హుషార్ !

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు

    మా చిన్నప్పుడు అమలాపురం లో నాలుగు సినిమా హాల్స్ ఉండేవి–కమలేశ్వర, శ్రీకృష్ణ,వెంకటేశ్వర, శ్రీనివాస ఇవేకాకుండా లక్ష్మినరసింహ అని ఓ టూరింగ్ టాకీసు కూడా ఉండేది. ఒక్కొక్క సినిమా హాల్లో ఒక్కొక్క పంపిణీ దారుల సినిమాలు వచ్చేవి, నవయుగ, శ్రీ ఫిల్మ్స్, పూర్ణా లాటివి. కమలేశ్వరాలో బాల్కనీ కి ఒక రూపాయ ఒక అణా టికెట్, కుర్చీకి 12 అణాలూ, బెంచీకి ఏడు అణాలూ, నేలకి పావలా. ఎడ్వాన్సు బుకింగులూ అలాంటివి ఉండేవికాదు. ఆటకి ఓ గంటముందుగా వెళ్ళి టికెట్లు తీసికోవడమే. సీట్లకి నెంబర్లూ అవీ ఉండేవి కాదు. పైగా కొత్తసినిమా అయితే బాల్కనీకి ఆనుకొనిఉన్న వరండాలో కూడా కుర్చీలు వేసేవారు. ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి సినిమా పాటల పుస్తకాలు కొనుక్కోవడం,సోడాలూ, కలర్ సోడాలూ తాగడం బలేగా ఉండేది.

మామూలుగా అయితే నేను కుర్చీకే వెళ్ళేవాడిని, మానాన్నగారు, అన్నయ్యలతో వెళ్ళేటప్పుడు బాల్కనీకి వెళ్ళేవాడిని.హెడ్మాస్టారుగారు కదా, వస్తున్నామని ముందుగా ఖబురు పంపితే కొత్తసినిమా అయినా టికెట్లుండేవి.సినిమాకి ముందర, హాల్లో పాటలు పెట్టేవారు. అదేదో ప్రార్ధన వేసేరంటే ఇంక సినిమా మొదలెడతారన్నమాట.సినిమా హాళ్ళదగ్గర వాతావరణం బలేగా ఉండేది.చుట్టుపక్కల ఊళ్ళకి అమలాపురమే పెద్ద టౌన్ కాబట్టి,పక్క ఊళ్ళనుండి, ఎద్దుబళ్ళు కట్టుకొని వచ్చి,మూడు హాళ్ళలోనూ మూడు ఆటలూ చూసికొని తిరిగి వెళ్ళేవారు.ఖర్చూ, టైమూ కలసివచ్చేది.

బాగా చిన్నప్పుడనుకునేవాడిని పెద్దైనతరువాత సినిమా హాల్లో గేట్ కీపర్ గా అయితేబాగుండునని, రోజూ సినిమా చూడొచ్చూ అని!! ఒక్కొక్కప్పుడు ఇంటర్వెల్ టూ ఇంటర్వెల్ దాకా టికెట్లిచ్చేవారు. అదో తమాషాగా ఉండేది, సినిమా రెండు మూడు వారాలు ఆడినతరువాతే ఈ ఫెసిలిటీ ఉండేది. కొన్ని కొన్ని సినిమాలలో పాటలు అద్భుతంగా ఉండేవి, అవి వినడానికి ఆ పాట వచ్చే టైముకి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళడమూ.

ఇవన్నీ ఒక ఎత్తూ, హిందీ సినిమాలు ఒక ఎత్తూ.1960 నుండి అనుకుంటా అమలాపురం లో హిందీ సినిమాలు చూపించడం మొదలెట్టారు. హిందీ సినిమాలు సామాన్యంగా మేటినీ లు గానే వచ్చేవి. ఆ రోజుల్లో ఎవరికీ హిందీ అర్ధం అయేది కాదు. మా హైస్కూల్లో ఓ హిందీ మాస్టారు శ్రీ వేమూరి రామకృష్ణగారు, ఈ హిందీ సినిమాలకి అనువాదం చెప్పేవారు. బెంచీకీ, నేలకీ మధ్యలో నుంచొని సినిమా ట్రాన్స్లేట్ చేసేవారు. ఏ సినిమాకైనా ” అది బొంబాయి మహా నగరం, అక్కడ….” అంటునే మొదలెట్టేవారు. ఓహో హిందీ సినిమాల కథలన్నీ బొంబాయి లోనే జరుగుతాయనుకునేవాళ్ళం !! సినిమాలో పాట వచ్చినప్పుడు ఆయనకి రెస్టూ. ఎన్నిపాటలుంటే అంత సుఖమన్నమాట ఆయనకి.

ఇంకో సంగతేమంటే ఈ సినిమా హాళ్ళవాళ్ళు, పట్టణం లో ఉన్న మ్యునిసిపాలిటీ, ఎలెక్ట్రిసిటీ వాళ్ళకీ ఫ్రీ టికెట్లివ్వాలి. లేకపోతే సినిమా మధ్యలో కరెంట్ తీసేసేవారు.సినిమా డబ్బాలు, రాజమండ్రీ నుండి రేవు దాటి బస్సుల్లో తీసికొచ్చేవారు, ఆ డబ్బాలు వచ్చేదాకా టెన్షనే అందరికీ.ఇవి కాకుండా నాగ్గాడి అభిమానులూ, ఎంటీవోడి అభిమానులూ. అయినా ఇప్పట్లాగ కొట్టుకోవడాలూ అవీ ఉండేవికాదు.

వీటికి సాయం, బాగా చిన్నప్పుడు సినిమా హాళ్ళ దగ్గరకు షికార్ కి వెళ్తే, అప్పుడు ఆడుతున్న సినిమా ఫిల్మ్ ముక్కలు బయట అంటే ప్రొజెక్టర్ రూమ్ కింద దొరికేవి. ఎవడికి ఎక్కువ దొరికేయో వాళ్ళింట్లో ఆ బొమ్మలు చూడాలన్నమాట. అంత జ్ఞాపకంలేదూ, అదో చిన్న బాక్సూ, దానికి ఓ భూతద్దమూ, వాటికి ముందరో లైటూ పెట్టి ఆ బొమ్మని గోడకి తెల్లదుప్పటీ కట్టి దానిమీద వేసేవాళ్ళం!!ఇప్పుడు ఆసంగతులన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది.

చెప్పానుగా అమలాపురంలో ఓ టూరింగ్ టాకీసు కూడా ఉండేది. ఆ హాల్లో మధ్యగా పెద్ద పెద్ద స్థంభాలూ, ఒక్కోసారి ఆలస్యంగా వెళ్ళామనుకోండి, ఆ స్థంభాల టిక్కెట్లే మిగిలేవి. వచ్చిన గొడవల్లా ఏమిటంటే సింగిల్ ప్రొజెక్టర్ అవడం వలన, మూడు ఇంటర్వెల్ లు ఉండేవి. దానిలో ” దో ఆంఖే బారా హాత్ ” సినిమా చూశాను.

మండపేట లో చదివేటప్పుడు, అక్కడ వాణీ మహల్, శ్రీకృష్ణా అని హాళ్ళుండేవి. ఈ మధ్యన నవజనార్ధనం టూర్ కి మండపేట వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్తూ, ఆ టాకీసులని చూసి, నా 1955-56 జ్ఞాపకాలు తాజా చేసికున్నాను. అలాగే తణుకు వెళ్ళినప్పుడు రాయల్ టాకీసూ, వెంకటేశ్వరా టాకీసూ.కాకినాడలో క్రౌన్ టాకీసూ గుర్తుంది. ప్రస్తుతం రాజమండ్రీ లో శ్యామలా టాకీసూ, కుమారీ టాకీసూ ఇప్పటికీ సినిమాలు వేస్తూంటే ఆనందం కలిగింది.

నా చిన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం వచ్చినప్పుడు, కమలేశ్వరా టాకీసు బయట వెంకటేశ్వరస్వామి విగ్రహం పెట్టి, దానికి పూజలు చేయడం, వచ్చినవాళ్ళందరూ హుండీలో డబ్బులు వేయడం, బాగా గుర్తు. 1981 లో మా కజిన్ రాజొల్లో పనిచెసేవాడు, తను మమ్మల్ని అప్పనపల్లి తీసికెళ్ళాడు. అక్కడ అప్పుడే కొత్తగా ఆలయ నిర్మాణం జరుగుతోంది. గోపురం మీద ఉన్నస్వామి విగ్రహాల్లో ఎన్.టి.రామారావు గారి పోలికలు ఎక్కువగా కనిపించాయి. ఆ శిల్పాలు తయారుచేసిన శిల్పి బహుశా ఎన్.టి.ఆర్ అభిమానేమో !!

ఇంక 1963 తరువాత ఉద్యోగానికి పూనా వెళ్ళినప్పటినుండీ, నన్ను ఆపేవాడే లేడు !! వారానికి మూడు సినిమాల చొప్పునా చూసేవాడిని. ఆనాటి సినిమా హాళ్ళు రెండో, మూడో మిగిలాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్సులు. వాటికి కుటుంబం అంతా కలసి వెళ్తే ఓ పెద్ద కాగితం ఖర్చైపోతూంది. పోనీ వెళ్దామా అంటే, సినిమాలూ అంత చూసేటట్లుగా ఉండడం లేదు. ఇదివరకైతే కొత్త హిందీ/ తెలుగు సినిమాలు టి.వీ లో చూపించడానికి చాలా టైము పట్టేది. ఇప్పుడలాగ కాదు కదా.

హాయిగా ఇంట్లో కూర్చునే చూస్తే బాగుంటుందనిపిస్తోంది.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–ఉత్తరాలు

    మొన్న మా ఇంటావిడ ” అమ్మ ఉత్తరం” అని ఒక బ్లాగ్ పోస్ట్ చెసింది. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మగారు వ్రాసిన ఉత్తరం ఇప్పటికీ జాగ్రత్తగా దాచి ఉంచి, దానిని చదివే పోలాల అమావాస్య పూజ చేసికుంటూంది. అది చూసి నేను వ్రాస్తున్నాను.ఆ రోజుల్లో ఈ టెలిఫోన్లూ అవీ ఉండేవి కావు కాబట్టి, క్షేమసమాచారాలు ఉత్తరాలద్వారానే తెలిసేవి. ఏదో మరీ అర్జెంటయితే తప్ప టెలిగ్రాములూ, టెలిఫోన్లూ వాడేవారు కారు.

    నాకు బాగా గుర్తు– ఆ వచ్చిన ఉత్తరాలన్నీ ఓ ఇనుప తీగ కి గుచ్చి ఉంచేవారు, అదీ చాలా పొడుగ్గా ఉండేది. దాన్ని పైన ఒంచి, ఓ మేకుకి తగిలించేవారు. ఆ ఉత్తరాలన్నీ దుమ్ముకొట్టుకు పోయేవి. ఎవరిదైనా ఎడ్రస్ కావాలంటే, ముందుగా దుమ్ము దులిపి, ఉత్తరం తీయడం, మనకి కావలిసిన ఉత్తరం ఎక్కడో మధ్యలో ఉందంటే, ఆ పైన ఉన్నవన్నీ తీయాల్సివచ్చేది. మళ్ళీ అవన్ని తిరిగి ఆ తీగలో గుచ్చడం ఓ పెద్ద ఎక్సర్సైజూ. ఆ పని చిన్న పిల్లలకిచ్చేవారు. మనం ఎప్పుడైనా మన అమ్మలకి వ్రాసేటప్పుడు– ” మహాలక్ష్మి సమానురాలైన అమ్మకి నమస్కారములు” అంటూ అన్ని వివరాలతోనూ వ్రాయాల్సిందే.

    మా చుట్టం ఒకావిడ ఉండేది, పాపం ఆవిడకి చదవడం వ్రాయడం వచ్చేది కాదు. గేటు బయట నిలబడి, నేను స్కూలునుండి వచ్చేటప్పుడు, నన్ను లోపలికి పిలిచి, చేతిలో ఓ బెల్లం ముక్క పెట్టి , వాళ్ళ అత్తారింటినుండి వచ్చిన ఉత్తరాలు చదవమనేది !!అందులో ఏం వ్రాశారో వాళ్ళ ఇంటాయన చెప్పడూ, కానీ ఈవిడకి అన్నీ కావాలీ, అందుకని నన్ను పిలిచేవారు.అవన్నీ పూర్తిగా చదవడం విసుగనిపించి, తూతూ మంత్రంలా చదివేసి, ఆ ఉత్తరంలోని భావాన్ని చెప్పేవాడిని. ఆవిడ ఊరుకుంటుందా, ” అదేమిట్రా ఆ ఉత్తరం అంత పెద్దగా రెండువైపులా ఉంటే, అంత కొచెమే చెప్పావూ ” అనేది.

    మాకు స్కూల్లో ఇంగ్లీషులో, లెటర్ రైటింగ్ ఒకటి ఉండేది–క్లాస్ టీచర్ కి ఓ ఉత్తరం,ఏదో కంపెనీకి ఉద్యోగానికి ఓ ఉత్తరం, –లాటివి ఉండేవి.అందులో ఎడ్రస్ కి కొన్ని మార్కులూ, స్టేషన్, డేట్ లకి కొన్ని,లెటర్ బాడీ కి కొన్నీ, అన్నీ పూర్తి అయిన తరువాత చివర సంతకం ఇంకో పేరుతో చేయాలి.కామాలూ, ఫుల్ స్టాప్పులూ ఎక్కడినా తప్పులుంటే మార్కులు కట్ !

    సాధారణంగా ఉత్తరాలన్నీ కార్డులమీదే వ్రాసేవారు. మరీ పెద్దవీ, ఇంకోళ్ళు చదవకూడనివీ అయితే తప్ప. శుభ సమాచారం అయితే కార్డుకి నాలుగు వైపులా పసుపు వ్రాసేవారు. అశుభమైతే నల్లగా ఏదో వ్రాసేవారు,అలాటి ఉత్తరాలు వస్తే చదివేసి చింపేయడమే. ఇంట్లో ఉంచితే కీడనేవారు.ఇంక పోస్ట్ మాన్ గురించి ఎదురు చూడడం ఓ నిత్యకృత్యం. మాకు అమలాపురం లో బస్సు( అదీ మెయిల్ బస్సనేవారు) మీద వచ్చేవి. రేవు దాటి టపా వచ్చేదాకా, ఈ బస్సు అక్కడే ఉండాలి ప్రొద్దుటే పోస్టాఫీసుకి వెళ్ళడం, కిటికీ బయట నుంచోవడం, మన ఏరియా పోస్ట్ మాన్ మనకి ఏమైనా ఉత్తరాలుంటే ఇచ్చేవాడు. అతనికి నమ్మకం ఉంటేనే.

    ఇప్పుడంటే కంప్యూటర్లూ అవీ వచ్చి ఉత్తరాల సందడి తగ్గిపోయింది కానీ, నాకు తెలిసిఉన్నంతవరకూ, 1998-99 దాకా నేనూ అందరికీ ఉత్తరాలు వ్రాసేవాడిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో అంటే 1963 లో రోజు విడిచి రోజు ఇంటికి ఉత్తరం వ్రాయవలసిందే. పూనా లో,రైల్వే స్టేషన్ కి కొంచెం దూరంలో ఆర్.ఎం.ఎస్ వాళ్ళ పోస్ట్ బాక్స్ ఒకటి ఉండేది. ఎప్పుడో ఒకసారి చూసిన గుర్తూ, ఆదివారాలు తప్పించి ప్రతీ రోజూ ఉత్తరాలు రెండేసి గంటలకోసారి తీస్తారని చదివినట్లు. ఓ సోమవారం సాయంత్రం ఒక అర్జెంట్ ఉత్తరం దాంట్లో వేశాను. నేను వేయగానే, ప్రక్కనే నుంచున్న ఓ పెద్దమనిషి వచ్చి, ఉత్తరం వేశావుకదా పోస్ట్ బాక్స్ మీద ఏం వ్రాశారో చదివేవా అన్నాడు. చూస్తే

” ఆదివారాలు మాత్రమే తెరువబడును” అని వ్రాసుంది. మరి నీకు తెలిసినప్పుడు నాకు చెప్పొచ్చుకదా అంటే, నేను చూసుకోకుండా వేశానూ, నా లాగ ఇంకెందరు వెర్రివెధవలుంటారో అని చూస్తున్నానూ, నువ్వు నాలుగోవాడివీ అన్నాడు. అప్పటినుండి ముందుగా బాక్స్ మీద రాసింది చదవడం ఓ అలవాటుగా చేసికున్నాను.

    ఆ మధ్యన పూణే లో మా అమ్మాయి,ఓ శనివారం సాయంత్రం ఫోన్ చేసి ” డాడీ,మా అమ్మాయిని స్కూల్లో పోస్ట్ కార్డ్ తీసికొనిరమ్మన్నారూ, ఆదివారం శలవు కదా, కొనడానికి వీలుపడదూ,నీ దగ్గర ఎలాగైనా దొరుకుతాయీ అనే నమ్మకం” అంది. ఉత్తరాలు వ్రాసినా లేకపోయినా, కార్డులూ, ఇన్లాండ్ లెటర్లూ,ఏరోగ్రామ్సూ నాదగ్గర ఉంచుకుంటాను.

    ఈ రోజుల్లో ఎంతమంది పోస్టాఫీసులకి వెళ్తున్నరన్నది తెలియదు. సరదాగా మీ పిల్లలకి కార్డులమీద ఉత్తరాలు వ్రాయడం నేర్పండి,మని ఆర్డర్ ఫారం నింపడం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ఇంకో పదేళ్ళు పోతే ఇవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఆ మధ్యన మా మనవరాలి చేత ఓ పోస్ట్ కార్డ్ మీద పిచ్చి గీతలు వ్రాయించి,దానిమీద మా అబ్బాయి ఎడ్రస్ వ్రాసి రాజమండ్రి కి పోస్ట్ చేయించాడు. అది మాకు వచ్చింది, దానిని లామినేట్ చేయించి, పూణే వెళ్ళినప్పుడు తనకి చూపిస్తే ఎంత సంతోషించిందో. ఇలాటి చిన్న చిన్న ఆనందాలు ఈయండి ఈ తరం వాళ్ళకి.

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు-“పల్లెవెలుగు”-3

    ఈ గ్రామాలన్నీ దాటుకుంటూ, మధ్యలో బస్సులో కూర్చొన్నవాళ్ళ ఖబుర్లు వింటూ, గతుకుల రోడ్డుమీద ఎలాగైతేనే తణుకు చేరాము.బైపాస్ రోడ్డుమీద బెల్లంమార్కెట్ దగ్గర దిగి, మా అత్తగారింటికి చేరాము. మా ఇంటావిడ కంటే నాకే తణుకు రోడ్డులు బాగా తెలుసని, ఒప్పుకుంది. ఎప్పుడైనా తణుకు వెళ్ళినా, తను వాళ్ళ అమ్మగారితోనూ, చెల్లెళ్ళతోనూ ఖబుర్లు చెప్పుకుంటూ కూర్చొంటుంది, నేను నడిచి ఊళ్ళోదాకా వెళతాను.అందుకని అక్కడ రోడ్లన్నీ నాకు పరిచయం. ఇదివరకు బ్రిడ్జ్ లేనప్పుడు,టీచర్స్ కాలనీకి వెళ్ళడానికి, కాలవ( గోస్తనీ నది అనాలి) బల్లకట్టుండేది. ఎంత హాయిగా ఉండేదో.చెప్పానుగా అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.తణుకు లో ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లే. అస్సలు రూపే మారిపోయింది.తణుకు కొంచెం పెద్ద పట్టణాలలోకే వస్తుంది, రోడ్డుమీద ప్రతీ మూడో షాప్పూ, చెప్పుల దుకాణమే !! అయినా కొన్నికొన్ని పాతరోజులనాటి రాయల్ టాకీసూ, వెంకటేశ్వరా టాకీసూ అలాగే ఉన్నాయి.మిగిలిన చాలా పాత ఇళ్ళూ, కట్టడాలూ, డెవెలప్మెంట్ కి బిల్డర్స్ కిచ్చేశారు, ఈ సారి మళ్ళీ వెళ్ళేటప్పడికి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అభివృధి ఉండాలి కాదనం, ఉన్న ఖాళీ ప్రదేశాలన్నీ,అపార్ట్మెంట్లకి వెళ్ళిపోతుంటే చాలా బాధ వేస్తుంది.ఆ ఊళ్ళో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. రోడ్లు వెడల్పు చేయలేరు, ఎక్కడ చూసినా ట్రాఫిక్కూ, దానికీ ఓ వరసా వావీ ఉండదు. మా చిన్నప్పుడు తణుకు వెళ్ళాలంటే, చెప్పానుగా అమలాపురంనుండి గన్నవరం దాకా బస్సులోనో, జట్కాలోనో వచ్చి కోడేరు రేవు దాటడం. నాకు ఆ కోడేరు రేవు దాటడం అంటే భలే మజా గా ఉండేది. అక్కడ గోదావరి చిన్న పాయ, పడవలో వెళ్తూంటే క్రింద భూమి కనిపించేది, నీళ్ళు అంత క్లియర్ గా ఉండేవి. ఒక్కొక్కప్పుడు అంటే వేసంకాలంలో నడిచే వెళ్ళొచ్చు.ఇప్పుడైతే రావులపాలెం నుండి సిధ్ధాంతం బ్రిడ్జ్ మీదనుండి బస్సుమీద వెళ్తారు.ఆరోజులు మళ్ళీ రమ్మంటే వస్తాయా?

    సాయంత్రం ఆరుదాకా తణుకులో మా అత్తారింట్లో గడిపి మళ్ళీ బెల్లం మార్కెట్ దగ్గరకొచ్చి వెయిట్ చేశాము. రాజమండ్రీ బస్సు ఓ అరగంట తరువాత వచ్చింది.ఇక్కడో విషయం గమనించాము– దగ్గరలో ఉన్న గ్రామాలన్నింటినుండీ, చదువుకోవడానికి తణుకు వస్తారు. అందువలన సాయంత్రం ఈ బస్సులన్నింటిలోనూ కాలేజీ పిల్లలే ఎక్కువగా ఉంటారు, ఆడపిల్లలూ, మగపిల్లలూ ఖబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉంటుంది. మా ఇద్దరికీ సీట్ దొరికింది.కండక్టర్ ఒక అమ్మాయి.ఇదివరకటి రోజుల్లో ఎప్పుడూ పోలీసులూ, కండక్టర్లూ మగవాళ్ళే ఉండేవారు. ఇప్పుడైతే పోలీసులూ, కండక్టర్లూ, పెట్రోల్ బంకుల్లో అటెండర్లూ చాలా చోట్ల ఆడపిల్లల్ని చూస్తున్నాము.ఇంకో విషయమేమంటే అమ్మాయిలు, గ్రామీణులైనా చాలా ధైర్యవంతుల్లా కనిపించారు, లెకపొతే బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం.

    ఈ ప్రాంతాల్లో సాయంత్రం ఆరయ్యేసరికి అకస్మాత్తుగా చీకటి పడిపోతుంది. ప్రొద్దుట చూసిన అందమైన దృశ్యాలు కనిపించవు సరే, బస్సులోంచి చూడాలంటే భయం కూడా వేస్తుంది. అంతా కటిక చీకటీ, ఆ చీకట్లో ఎంత హెడ్ లైట్లున్నా, ఎదురుగా వచ్చే లారీలూ, బస్సులూ, మధ్యమధ్యలో ఆటోలూ ఒకటేమిటి చెప్పకండి, ఈ హడావిడిలో సైకిళ్ళమీద వచ్చేవాళ్ళూ, వీళ్ళందరినీ తప్పించుకుంటూ డ్రైవ్ చేయాలంటే ఎంత నిపుణత ఉండాలో. పక్కకు చూడాలంటే భయం. ఎదురుగా వచ్చే వెహికిల్ లైట్ మన డ్రైవర్ గారి కళ్ళల్లో పడి, ఎక్కడ కంట్రోల్ తప్పి, పక్కనే ఉన్న కాలవలోకి పెట్టేస్తాడో, మర్నాడు పేపర్లో మన ఫొటోలు పడతాయో అని.మనం ఇక్కడున్నట్లు పూణేలో ఉన్న పిల్లలకి చెప్పలెదూ, ఎక్కడ దిక్కులెని చోట పడతామో, అని వెంటనే పిల్లలకి ఎస్.ఎం.ఎస్ పంపేశాను.

    దారిలో ఏదో కొంచెం పెద్దగ్రామాలైన పెరవలీ, కానూరూ తప్పించి, ఎక్కడాఆ లైటు కనిపించదు. అయినా ఆచీకట్లోనే ఈ బస్సులోఉన్న కాలేజీ పిల్లలూ దిగుతారు. పైగా లోడ్ షెడ్డింగ్ ధర్మమా అని గ్రామాలు చాలా చోట్ల కరెంట్ ఉండదు. దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపించే దీపాలూ, అమ్మో, పొద్దుట ఉన్న సంతోషమంతా డిప్రెషన్ లోకి దింపేసిందండి. చాలామంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లల్ని విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ,ఏలూరు లాటి ఊళ్ళలో ఉంచి హాస్టళ్ళలో పెట్టి అంత ఖర్చుపెట్టి ఎందుకు చదివిస్తారో ఇప్పుడు అర్ధం అయింది. ప్రొద్దుటెప్పుడో కాలెజీ కి వెళ్ళి, బస్సులు పట్టుకుని అంతంత చీకటిలో, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియక, ఆ తల్లితండ్రులు పడే యాతన భరించడంకంటే దూరాభారమైనా హాస్టల్లో పెట్టడమే నయం. ఎక్కడో అక్కడ క్షెమంగా ఉండి చదువుకుంటున్నాడూ అనే సంతృప్తైనా ఉంటుంది. వర్షాకాలం అయితే చెప్పఖర్లెదు,ఆ సన్నటి రోడ్లమీద మన పల్లెవెలుగు బస్సు డ్రైవర్లు ఎలా తీసికెళ్తారో.

    ఈ చీకట్లన్నీ దాటుకొని,రాజమండ్రీ రోడ్,రైలు బ్రిడ్జ్ కనిపించగానే అమ్మయ్యా అని ఊపిరి పీల్చాను. ప్రొద్దుట వెళ్ళడమూ, ఆ చీకట్లో “పల్లెవెలుగు” బస్సులో తిరిగి రావడమూ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అందుకనే చెప్తాను “హైవే” మీద వోల్వో బస్సులోనో, ఏ.సీ. టాక్సీలోనో కాదు వెళ్ళడం, ఏ.పీ.ఎస్.ఆర్.టి.సి వాళ్ళ ప్యాసెంజర్ బస్సులో గ్రామీణ ప్రాంతాలకి, గొదావరి జిల్లాల్లో ప్రయాణం చేయండి, అస్సలు మజా ఆస్వాదించండి. సర్వేజనా సుఖినో భవంతూ !!