బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– stress busters…

    నిన్న ఒకటపా వ్రాశాను. మా ఇంటావిడ వ్రాసిన ఒక టపా లో ఒక వ్యాఖ్య చదివి, తను ఎంత బాధ పడిందో తెలియచేస్తూ… and also my take on the same.

ఈవేళ, ఆ ” అజ్ఞాత” నా భాషలో అనామకుడు, బాధ పడుతూ, ఒక వ్యాఖ్య పెట్టారు– “లక్ష్మి గారు
మనసు బాగోలేని ఒకానొక క్షణంలో ఆ కామెంట్ రాసిన వెధవని నేనే. క్షమాపణలు. దయచేసి బ్లాగు రాయడం కొనసాగించండి.
మొదటి అనామక
“- అంటూ. ఏదో మనసు బాగుండనప్పుడు ఉద్రేకంలో ఏవేవో అనుకోడం, ఆ “కోపాన్ని” ఎదుటివారిమీద చూపించేయడం, చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. కానీ, అది realise చేసి, తప్పుని ఒప్పుకోడంలోనే, అసలు గొప్పతనం అంతా.ఈ విషయంలో ఆ “అజ్ఞాత” కి నా hearty compliments...

ఇలాటివి మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఏవో చికాకులొచ్చి, ఆఫీసుకి వెళ్ళి, ఏ కారణం లేకుండా, ఎవడిమీదో ఆ చిరాకు ప్రదర్శిస్తూ, చడా మడా కోప్పడేయడం. పాపం అవతలివాడు ఎప్పుడూ బాగా పనిచేసేవాడే, కానీ, అదృష్టం బాగోక, ఈ ఇంట్లో చికాకులొచ్చిన పెద్దమనిషి చేతిలో బలైపోతాడు.ఈ పెద్దమనిషి కొద్దిగా ఇంగితజ్ఞానం ఉన్నవాడైతే, తను చేసిన తప్పు తెలిసికుని, ఆ అవతలివాడిని పిలిచి,సద్దిచెప్తాడు.కాదూ ఎవడెలా పోతే మనకేమిటిలే అనుకునేవాడైతే, తన పట్టు వదలడు. దీనితో ఇద్దరి మధ్యా సంబంధబాంధవ్యాలు strain అయిపోతాయి.అలాగని జీవితాంతం తెలిసికోకుండా ఉంటాడంటారా, అబ్బే ఎప్పుడో ఒకప్పుడు తెలిసికుంటాడు. But it is too late..

ఇలాటివి ఊళ్ళోవాళ్ళతో ఉండే వ్యవహారాలు. కానీ ఒక్కోక్కప్పుడు, భార్యా భర్తల మధ్యే ఇలాటివి తలెత్తుతూంటాయి. అప్పుడప్పుడేమిటిలెండి, ఎప్పుడు పడితే అప్పుడే, తేరగా, లోకువగా దొరికేది కట్టుకున్న పెళ్ళామేగా.. మన “ బక్క కోపం” అంతా ఆ poor soul మీద చూపించేసికోడం. ఆ కోపంలో ఏం మాట్టాడుతున్నామో కూడా తెలియదు.ఒళ్ళు తెలీకుండా చడా మడా అరవడం. ఒక్కోసారి, ఎప్పటినుంచో దాచుకున్న ” కచ్చి” అంతా మాటల రూపంలో చూపించేయడం. ఓ అర్ధం పర్ధం ఉండదు. అనుకుంటూంటాను, ఎప్పుడో ఎవరికో ఇలాటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏ రికార్డింగో చేసి చూపిస్తే ఎలా ఉంటుందో అని. ఛాన్సొస్తే ఈ రోజుల్లో వెళ్ళే Counselling చేసేవాళ్ళందరిదగ్గరా ఇలాటివే ఉంటాయేమో. లేకపోతే అన్నన్ని సలహాలెక్కడ ఇస్తారూ?

40 ఏళ్లల్లోనూ లెఖ్ఖలేనన్నిసార్లు, ఇంటావిడమీద గయ్యిమంటూనే ఉంటున్నాను, ఏదో నా రోజులు బాగోబట్టి, తిరగబడలేదు.అసలు తిరగబడితే ఏం చేసుంటానంటారు, నోరు మూసుకుని కూర్చునేవాడినేమో. Anyway it is all hypothetical..పోనీ అదేదో తెలిసికుందామా అంటే, తను తిరగబడా లేదూ, నేను ఆవిడమీద అప్పుడప్పుడు ఏ కారణం లేకుండా, గయ్యిమనడం మానాలేదూ.. ఏమిటో ఇదిమాత్రం నా unfulfilled wish గా మిగిలిపోతుందేమో..ఎప్పుడైనా అలాటిదంటూ జరిగితే మాత్రం చెప్తాలెండి.అందరూ అనుకుంటూంటారు.. ఓసారి లక్ష్మిగారు ఈయనమీద తిరగబడుతే బాగుండునూ, రోగం కుదురుతుందీ.. అని. ఉత్తిపుణ్యాన్న ఆవిడలో లేని పోని ఆలోచనలూ, ఐడియాలూ ఇవ్వఖ్ఖర్లేదు... మా దారిన మమ్మల్ని బతకనీయండి. OK ?

కానీ ప్రతీచోటా ఇలాగే ఉంటుందేమో అనుకుంటే, పప్పులో కాలేసినట్టే.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవేవో equality లూ, సింగినాదాలూనూ. భార్యాభర్తలిద్దరూ సంపాదనాపరులే. వెధవ్వేషాలేస్తే, నీ దిక్కున చోట చెప్పుకో ఫో.. అనేసి, బిచాణా కట్టేసి వెళ్ళిపోతుంది.అలాగని నేనేదో సంపాదనాపరుణ్ణీ, మా ఇంటావిడ కేమీ సంపాదనలేదూ, అందువలన అణిగి మణిగి ఉందీ అనుకుంటే, తనని కించపరిచినట్టే. ఒక్కోళ్ళ స్వభావాలు అలాగే ఉంటాయి.” ఫొనిద్దూ.. అరిచి అరిచి ఆయనే నోరుమూసుకుంటాడూ..”. పిల్లలేడుస్తూంటే ఏదో ఒక్కసారి దగ్గరకు తీసికుంటారు. కానీ అదే ఓ weapon లాగ ఉపయోగిస్తూంటే, their place is shown..ఎన్నిచెప్పండి, మా ఇంటావిడ ఇంకా నా place నాకు చూపించలేదు...ఏదో నా రోజులు వెళ్ళిపోతున్నాయి.

ఇలాటి పరిస్థితే వచ్చుంటుంది– లతామంగేష్కర్ గారికి, ఎందుకు చెప్పండి, హాయిగా రోజులెళ్ళిపోతున్నాయి కదా, ఎందుకొచ్చిన గొడవా, ఎప్పుడో రఫీ గారికీ ఈవిడకీ గొడవొచ్చిందిట, ఆ గొడవేదో 50 ఏళ్ళ క్రితమే సెటిల్ అయిపోయింది. ఇన్నేళ్ళకి, ఆయనేదో క్షమాపణ పత్రం రాసిచ్చారూ అని చెప్పుకోవాలా? వదిలిపోయింది, రఫీ గారి కొడుకు, ఆ పత్రం ఏదో చూపించండి, లేకపోతే legal గా proceed అవుతానూ అని ఓ ప్రకటన చేశాడు.బహుశా, లతామంగేష్కర్ కి, బహిరంగంగా, రఫీగారు వ్రాసిచ్చారూ అని చెప్పుకోడం ఓ stress busteరేమో.

సినిమాల్లో చూస్తూంటాము- హీరోలకి కోపాలూ తాపాలూ వచ్చినప్పుడు, అవేవో punching bags ట, వాటిమీద టపా..టపా ..కొట్టేస్తూంటారు.ఇప్పుడున్న ఎపార్ట్మెంటుల్లో ఈ punching bags లకీ వాటికీ చోట్లెక్కడా, ఏదో డైనింగ్ టేబుల్ నో ,ఓ గోడనో కొట్టేసికుంటే సరి ! అదికూడా చక్కతో చేసిన డైనింగ్ టేబుల్ అయితే ఫరవాలేదు. ఏ గ్లాసుదో అయితే మళ్ళీ గొడవా, విరిగూరుకుంటుంది. చూసుకుని మరీ చేయండి. కాదంటారా, పిల్లాడికి ఏవో మార్కులు తక్కువొచ్చాయనో,అసలు చదువు గురించి పట్టించుకోకుండా టీవీ చూస్తూంటాడనో, ఓ నాలుగు దెబ్బలేసేయండి. తరువాత దగ్గరకు తీసికుని ఓ చాకొలేట్ కొనేసియ్యండి. ఇలాటివైతే మన దేశంలో గొడవుండదు. బయటి దేశాల్లో అయితే మళ్ళీ ఆ పిల్లలు పోలీసులకి ఫోను చేస్తారుట. వామ్మోయ్ మళ్ళీ ఇదో గొడవా. ఇక్కడే హాయి.. అందుకే అంటారు.. “మేరా భారత్ మహాన్..”. ఏదో నాలుగు దెబ్బలు తిన్నా ఓ చాకొలేట్ తో గొడవొదిలిపోతుంది…మన కోపమూ చల్లారుతుంది..

అందరిలోకీ రాజకీయనాయకుల పని హాయి. అవతలి పార్టీ వాడిమీద కోపం వచ్చినప్పుడు అవాకులూ చవాకులూ మీడియా వాళ్ళని పిలిచి మరీ వాగేస్తాడు.ఎప్పుడో కొన్ని రోజులతరువాత, ఎవడిమీదైతే పేలాడో, వాడే అధికారంలోకి వస్తే, ఇంద్రుడూ చంద్రుడూ అని పొగిడేస్తాడు. అదేమిటండీ ఇదివరకు ఇంకోటేదో అన్నట్టున్నారూ అని అడిగినా, I was quoted out of context అనేసిఊరుకుంటాడు.“మమ” అనుకున్నట్టన్నమాట…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బ్లాగుల్లో వ్యాఖ్యలు….

    ఏదో కాలక్షేపానికనండి, లేదా తమకి తెలిసినవి ఇతరులతో పంచుకోవాలనే సదుద్దేశ్యం తో అనండి, ఈ మధ్యన చాలా మంది, తమకు ఉన్న కొద్దిపాటి కంప్యూటరు విజ్ఞానం ఉపయోగించి, ఏదో సరదాగా బ్లాగుల వ్యాపకంలోకి అడుగెట్టారు. చదివేవాళ్ళు చదువుతారు, నచ్చిన వారు ఓ వ్యాఖ్య రూపం లో ఈ బ్లాగు టపా వ్రాసినవారికి ప్రోత్సాహం ఇస్తూంటారు. అలాగని ఒక్క వ్యాఖ్యా రాకపోతే, ఏదో కొంప మునిగిపోయిందని నిరుత్సాహ పడఖ్ఖర్లేదు. హారం లో “ఎక్కువగా చదివిన టపా ” లో తమ టపా పేరు చూసుకుని సంతోష పడడం.

    నాకైతే పెద్ద పనీ పాటా లేదు కాబట్టి, మొదట్లో రోజుకొక టపా వ్రాసేవాడిని. క్రమక్రమంగా వారానికోటిలోకి దిగిపోయింది. చదివేవారు చదువుతున్నారు, లేని వారు మానేస్తున్నారు. ఎవరిష్టం వారిదీ. పాపం, మా ఇంటావిడకి అలా కాదు కదా, సవాల‍క్ష పనులాయే, weekends లో పిల్లలతో బిజీ, వారమంతా పూజలూ, పునస్కారాలూ, కొంప neat గా పెట్టుకోవడాలూ, సాయంత్రాలు evening walk లూ, ఒకటేమిటి ఎప్పుడూ బిజీ గానే ఉంటుంది. అయినా ఏదో ఒక సమయంలో నేను system దగ్గర లేనప్పుడు ఒకటీ అరా టపాలు వ్రాస్తూంటుంది. ఏదో “ప్రవచనాలు” చెప్పాలని కాకపోయినా, తనకు తెలిసినదేదో మిగిలినవారితో పంచుకోవాలనీ మాత్రమే. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా వెర్రి వేషాలు వేస్తే వెంటనే retort రూపంలో ఓ టపా పెట్టేస్తూంటుంది. Its all fun.. మా గొడవలన్నీ చదివేవారికి ఓ entertainment అంతేకదండీ…సరదాగా వెళ్ళిపోతోంది.

   ఆ సందర్భం లోనే, నిన్న ఆవిడ ఫ్రెండు ఒకావిడ, మాకు దగ్గరలోనే ఉంటున్నారు, ఆవిడ ఫోను చేసి, ” గణపతి బప్పా మోరియా..” అని ఇక్కడవాళ్ళందరూ(పూణె లో) అంటూంటారు కదా, “మోరియా” అంటే అర్ధం తెలుసునా అని అడిగారు. ఈవిడెమో, వెంటనే “గూగులమ్మ” ని వెదికేసి, అక్కడున్నదేదో చెప్పింది. అక్కడితో ఆగిపోయుంటే, అసలు ఈ టపా యే ఉండేది కాదు. ఊరికేకూర్చోక, తను తెలిసికున్నదేదో, పోనీ అందరికీ తెలియచేద్దామూ అనే noble intention తో ఓ టపా వ్రాసింది.దానికి ఏవో వ్యాఖ్యలొస్తాయని ఆశించి కాదు. రాకపోతే గొడవే ఉండేది కాదు.

    ఓ self styled భాషాభిమానికి ఏదో పొడుచుకొచ్చేసింది.ఓ వ్యాఖ్య పెట్టాడు(రు). పోనీ పేరైనా వ్రాసుకున్నాడా అంటే అదీ లేదూ, “అజ్ఞాత” ట. నాకైతే “అనామకుడో అనామకురాలో” అన బుధ్ధేసింది.అంత పేరుకూడా చెప్పుకోడానికి ధైర్యం లేని పక్షి అసలు వ్యాఖ్యలు పెట్టడం ఎందుకూ. పోనీ పెట్టాడే, తన so called తెలివితేటలన్నీ ఉపయోగించుకోవాలా? అన్నిటికీ కొసమెరుపేమిటంటే he/she had the audacity to advise my wife not to write blogs…thats the height of it.

    పాపం మా ఇంటావిడ ఆ వ్యాఖ్య చదివి చాలా బాధ పడిపోయింది. మరీ నెమ్మదస్తురాలు కదా, ఆ కారణం చేత సుతిమెత్తగా సమాధానం వ్రాసింది. ఒక విషయం చెప్పండి, అసలు ఈ గణపతి సార్వజనీయ సంబరాలు ప్రారంభం అయింది ఎక్కడో తెలుసునా ఈ so called పాఠకుడికీ. 1893 లో స్వాతంత్ర సేనాని బాల గంగాధర తిలక్ గారు మొట్టమొదటిసారి పూణె లోనే ప్రారంభించారు. వివరాలు ఇక్కడ చదవండి. కాలక్రమేణా, దేశంలోని మిగిలిన ప్రాంతాలవారుకూడా మొదలెట్టారు.ఆ సందర్భం లోనే గణపతి నిమజ్జనం రోజున “ గణపతి బప్పా మోరియా, పుడ్చా వర్షీ లవకర్ యా..” అంటే, గణనాధా, వచ్చే ఏడాది మళ్ళీ త్వరగా రావాలి.. అని భజనలు చేసికుంటూ ఊరేగింపు చేస్తారు. ఆ భజనలోని “మోరియా” అనే పదానికి అర్ధం చెప్పడం, మా ఇంటావిడ చేసిన పాపం. ఈ మాత్రానికి ఆ so called అనామక భాషాభిమాని అంతంత రాధ్ధాంతం చేసేసి, తనని తాను expose చేసికున్నాడు.

    షిరిడీ ( మళ్ళీ మహరాష్ట్రాయే) సాయినాధ మందిరం దగ్గర “ సబ్ కా మాలిక్..” అనే కదా వ్రాస్తారు, మరి ఆంధ్ర దేశంలోని సాయిబాబా దేవాలయాల్లో “ అందరికీ యజమానీ..” అని అనువదిస్తేనే, సాయిబాబా మీద భక్తి ఉన్నట్టా ? అలాగే గజాననుని విషయం లోనూ.ఈవేళ హైదరాబాద్ లోని గణేశ నిమజ్జన ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు- ఈ so called అనామక భాషాభిమాని చూసుంటే తెలిసేది. “ గణపతి బప్పా మోరియా..” అని అచ్చ తెలుగులోనే వ్రాశారు.టివీ చూడ్డం మానేస్తారా అనామక భాషాభిమానీ..?

    అవతలివారు ఏ context లో వ్రాశారూ అని చూడాలి కానీ, ఏదో తెలుగులో వ్రాయడం వచ్చుకదా అని, అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు పెట్టడం కాదు. నచ్చకపోతే చదవడం మానేయొచ్చు. నచ్చలేదూ అనొచ్చు. అంతేకానీ, అవతలివారి గురించి
నాలుగు లైన్లకి ముఫ్ఫై తప్పులు. ఆ మాత్రం ఓపిక లేనివాళ్ళు తెలుగు బ్లాగు మొదలెట్టడం ఎందుకో?” అనేటంత పాండిత్యం ఉందా ఆ so called అనామక భాషాభిమానికీ.ఇక్కడ మా ఇంటావిడ తనకేదో పాండిత్యం ఉందని ఎప్పుడూ వ్రాసుకోలేదు.

    ఊరికే చదివేయడం కాదు, వ్యాఖ్య పెడదామనుకున్నప్పుడు కొద్దిగా సంస్కారం కూడా ఉండాలి. ఈ విషయాలన్నీ తనంతట తాను వ్రాసుకోలేదు. ఆ మాయదారి వ్యాఖ్య చదివి, “పోన్లెద్దురూ ఇంక వ్రాయడం మానేస్తే గొడవే ఉండదూ” అని అనడం వలన ఈ టపా వ్రాయవలసొచ్చింది.

    భాషమీద అభిమానం అందరికీ ఉంటుంది. దానిని వ్యక్తపరచడానికి ఓ వరసా, వావీ ఉంటుంది.అంతేకానీ, “తెలుగు వెధవ బాష. దాన్ని వదిలేయండి..” అనే దౌర్భాగ్యపు మాటలు వాడవలసిన అవసరం లేదు.ముందుగా తనకి తాను improve చేసికుంటే, ఇంకొకరికి చెప్పే చొరవా, అధికారం వస్తాయి. Good spirit లో పెట్టే ఎలాటి వ్యాఖ్యలైనా కళ్ళకద్దుకోవాలనే ఉంటుంది.అంతేకానీ, టపాలు వ్రాసేవారి feelings కించ పరచకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– అసలు అంత అవసరమంటారా ఇప్పుడు…

    ప్రపంచంలో ప్రతీవారూ, ఊరికే Great అవరు. అలా చెప్పుకోవాలంటే, తన field లోనే great అవడం కాదు.మిగిలిన విషయాల్లో అంటే, ప్రవర్తన, బయటి వారితో వారి సంబంధ బాంధవ్యాలూ.. ఇలా చాలా వాటిలో వారి గొప్పతనం చాటుకోవాలి.
పాటల విషయంలో ఆవిడకు ఆవిడే సాటి. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ” పాట” అనే “మాట” ఎక్కడ ప్రస్తావనకొచ్చినా, ఈ మధుర గాయని తరువాతే కదా ఇంకోరి పేరు తీసికునేది. మనదేశంలో వాడుకలో ఉన్న ప్రతీ భాషలోనూ పాటలు పాడీన ఘనత లతా మంగేష్కర్ కాక ఇంకెవరికుందీ?

    భారత ప్రభుత్వం ఆవిడని “ భారత రత్న” తో సత్కరించింది. సంగీత సామ్రాజ్యంలో మనకున్న “రత్నాల్లో”ఆవిడొక్కరూ.ఈవేళే 83 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నారు.

    ఇంతంత పేరు ప్రఖ్యాతులు అలవోకగా స్వంతం చేసికుని, దేశప్రజలందరి గుండెల్లోనూ ఓ స్థానం సంపాదించుకున్న ఆవిడకి, ఇన్ని సంవత్సరాల ( 50 ) ఎందుకూ, ఎవరికీ ఉపయోగించని ఓ controversy లేవతీయడం ఏమైనా బాగుందా? దీనివలన ఆవిడ సాధించిందేమిటంట? ప్రముఖ గాయకుడు రఫీ సాబ్, ఈవిడకి క్షమాపణ వ్రాసిచ్చేరా అని ఎవరైనా అడిగారా, అదీ 50 సంవత్సరాల తరువాత? పోనీరాసిచ్చేరే అనుకుందాము, రఫీ గారి జీవిత కాలంలో బయట ఎందుకు పెట్టలేదూ?

    మామూలుగా ఎవరూ తమను పట్టించుకోడం లేదని, కొంతమంది లేనిపోనివేవో లేవతీస్తూంటారు. అలాటి అవసరమూ ఆవిడకి లేదే. ఆవిడ గొంతుకు వినిపించకుండా ఒక్కరోజైనా ఉంటుందా. మరి ఏమిటి ఆవిడ బాధ? రఫీ గొప్పవారా, లతా గొప్పవారా అన్నది అసలు debatable కాదు. కారణం ఇద్దరి గొంతుకులకూ పోలికే లేదు for the simple reason ,one is male and the other a female !!

   అదేదో “నెత్తిమీద శని దేవత ఆవహించినట్టుగా” ఆవిడ ఉత్తిపుణ్యాన్న ఈ గొడవ లేవదీసింది. ఎందుకు లేవదీశారో ఆవిడకే తెలియాలి. ఇప్పుడు చివరకి జరిగేదేమిటీ, ఎప్పుడు లతా మంగేషకర్ పేరు వచ్చినా, ” పంటికింద రాయి” లా ఈ గొడవ గుర్తుకొస్తుంది. అంత అవసరమా ఇప్పుడు? ఆవిడ పాడిన వేల ఆణిముత్యాల కంటే, ఈ గొడవే మిగిలిపోతుంది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు అలా ఇరుకులో ఎందుకు పెడతారో….

    ప్రతీవారికీ ప్రతీ దానిమీదా ఓ అభిప్రాయం ఉంటుంది. కారణాలు ఏమైనా కావొచ్చు. అదీ ఓ సినిమామీదైతే, ఈమధ్య హిందీలో, చాలా సినిమాలు పాతవాటిని కొత్త నటీనటులతో తీస్తున్నారు. పాత తరంవారు, “ఎన్నిచెప్పండి, పాతది పాతదే..” అనడం మామూలైపోయింది. అది నిజం కూడానూ. ఇంకా తెలుగులో అలాటి ప్రయోగాలు మరీ అంత ఎక్కువగా లేవు. ఏదో అప్పుడెప్పుడో పాండురంగడు అని ఓ సినిమా తీసి, చేతులు కాల్చుకున్నారు. ఏం చేస్తాం పాండురంగమహాత్మ్యం తో పొల్చి చూస్తే, కొత్తది అంత దరిద్రంగా ఉంది. బాలయ్య అభిమానులకి తప్ప ఇంకెవరికీ నచ్చినట్టు లేదు. ఆ బాలయ్య కేమో, తన తండ్రిగారికి తనే పేద్ద వారసుడని ఓ వెర్రి నమ్మకం.దానికి సాయం నిర్మాతలు కూడా, అన్నగారి పాత చిత్రాల్లో, బాలయ్య తప్ప ఇంకెవరు చేయగలరూ అనుకోడం.మన ప్రాణం మీదకి తెస్తున్నారు. ఆ ఒరవడి లో వచ్చిందే “శ్రీరామరాజ్యం”.బాపు గారి దర్శకత్వం లో వచ్చిందీ, పైగా శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారి జీవితంలో వ్రాసిన చిట్టచివరి screenplay కదా అనే అభిమానంతో, శ్ర్రీరామరాజ్యం విడుదల అయిన మొదటి రోజు మొదటాటకే వెళ్ళాము. శ్రీ బాపూ గారి : మత్తు” లో ఉండి, దానికి సాయం ఇళయరాజా ఇచ్చిన ఒకటి రెండు పాటల ధర్మమా అని నచ్చేసినట్టే అనిపించింది ( inspite of Balakrishna). అప్పటికీ అనుకున్నాను కూడానూ, బాలయ్య తప్పితే ఇంకోళ్ళున్నా బాగుండేదీ అని. మన బ్లాగుల్లో అన్ని రకాల అభిప్రాయాలూ వ్రాశారు, “లవకుశ” తో పోలుస్తూ.. కొంతమంది ఏకీభవించారు, ఈ తరం వారైతే “పాత చింతకాయ పచ్చడి” అని తోసిపారేశారు. ఏమిటో బాపూగారు ఇన్నాళ్ళకి ఓ సినిమాకి దర్శకత్వం వహించారూ, అదేమో బాగోలేదంటున్నారూ అనుకుని కొంచం disappoint మాత్రం అయ్యాను.ఇంక ఆ విషయం వదిలేశాను.

    మన టివీ చానెళ్ళవాళ్ళు ఒక్కొక్కప్పుడు కొంపలంటిచేస్తూంటారు. ఎందుకు చెప్పండి, మన ప్రాణం తీయడానికి కాకపోతే, ఇవాళే
ఒకే సమయానికి ( సాయంత్రం 6.00 గంటలకి) జెమినీ లో “లవకుశ”, జీ లో ” శ్రిరామరాజ్యం” చూపించాలా? దీనితో జరిగిందేమిటంటే, ఓ రిమోట్ నొక్కు తో రెండు సినిమాలూ చూసే భాగ్యం కలిగింది. The differences were too striking.. దీనికి సాయం ఒకదాంట్లో ఒక సీన్ అయిన తరువాత, అదే సీన్ రెండో దాంట్లో చూడ్డంతో, ఆ తేడాలు మరీ కళ్ళకు కట్టినట్టుగా కనిపించాయి.

   మొట్టమొదటగా శ్రీరాముడు– అసలు NTR చేసిన పాత్ర బాలయ్య చేయడమేమిటీ? ఏదో ఆయన కొడుగ్గా పుట్టడం తప్పించి, ఆయనతో (specially నటన విషయంలో) అస్సలు పోలికే లేదు. ఆయనేమో భారీ విగ్రహం, ఇక్కడ బాలయ్యేమో బుల్లిబుడంకాయ, పైగా మెడంతా ముడతలూ..ఏదో అగ్నానం, క్రుతగ్నత లాటివి సద్దేసికుంటే, ఇంక మిగిలిన సంభాషణలు, డయలాగ్గులూ simply memorable. ఇంక బాలయ్య ఏ డయలాగ్గు చెప్పినా ” సింహా” గుర్తుకొస్తాడు.మాయాబజారు పాత సినిమాలో పాండవుల్ని ఎక్కడా చూపించకుండా మహాభారత కథని ఆ కె.వి.రెడ్డి గారు ఎలా నడిపారో, అలాగ శ్రి బాపూ గారు, ఇప్పటి శ్రీరాముణ్ణి కనిపించనీయకుండా, ” శ్రీరామరాజ్యం” తీసుంటే ఎంత బావుండేదో అనిపించింది. మాయాబజారు నచ్చలేదూ, ఇదీ అలాగే అనుకునేవాళ్ళం. అదో novel పధ్ధతీ…పోనిద్దురూ బాపూ గారిమీదుండే అభిమానంతో మొహమ్మాటానికి బావుందనుకున్నాను.

   ఇంక సీత పాత్ర– అంజలీ దేవి born for that role.. స్వయంగా డయలాగ్గులు, పైగా ఆ పాత్రలో ఇమిడిపోయింది.శ్రీరామరాజ్యం లో నయనతార, ఫరవాలేదు,సునీత డబ్బింగు ధర్మమా అని వీధిన పడలేదు. But still… ఇద్దరికీ “ముత్యమంత పసుపూ” కీ ” Fair and Lovely” కీ ఉన్నంత తేడా ఉంది.

    సంగీతం విషయంలో ఏదో రెండు మూడు పాటలు తప్పించి, శ్రీ ఘంటసాల మాస్టారు head and shoulders above.. దానికి సందేహమే లేదు.లవకుశ లో ఉన్నన్ని పద్యాలు ఇప్పటి సినిమాలో ఉంటే ఎలాగండీ, ఈరోజుల్లో ఎవరికి అర్ధం అవుతాయీ అన్నారు జనం. ఆ పద్యాల్లో అంత అర్ధంకానంత పదాలేమున్నాయి? పైగా they suited the occasion.. ఒక్కో పాటా ఆణిముత్యం. ఇన్నేళ్ళయినా ఇప్పటికీ పాడుకుంటున్నారంటేనే తెలుస్తోంది.

    యుధ్ధాల సీన్లు పాత సినిమాలో ఏదో దీపావళి బాణాసంచా లాగ ఉన్నాయి. కానీ ఇప్పుడో గ్రాఫిక్స్ ధర్మమా అని, realistic గా ఉన్నాయి.కొన్ని సీన్లలో తేడా మరీ కనిపించిపోయింది. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించి, స్వర్ణ సీత ప్రతిమని తయారు చేయించాలని అనుకోడం ఏమిటీ ( ఇంకా బయటివారికి తెలిసే అవకాశమే లేదూ), సింహద్వారం తలుపులు తోసుకుంటూ, జనం అందరూ వచ్చేసి తమ బంగారం ఇచ్చేస్తారూ అని శ్రీరామరాజ్యంలో చూపించారు. అదే “లవకుశ” లో, ఓ పధ్ధతిగా, ముందుగా ఓ శిల్పీ, తరువాత జనం వచ్చినట్టూ ఓ disciplined way లో. అవునుకదా ఎంతచెప్పినా ఆ రోజుల్లో ఓ క్రమశిక్షణా అవీ ఉండేవి, ఇప్పుడో ఎక్కడ చూసినా ధర్నాలూ, ప్రొటెస్టులూనూ…బాపూగారు కూడా పోన్లెద్దూ అనేసికునుంటారు..

   చివరలో సీతామ్మవారు నోము చేసినప్పుడు ఆ రోజుల్లో కాగితప్పూలు (they were too obvious). ఇప్పుడేమో ఏక్ దం ఓవెన్ ఫ్రెష్…చివరకి నాకనిపించిందేమిటంటే రెండు సినిమాలకీ ఉన్న తేడా– లవకుశ ఏ ఎరువూ లేకుండా తయారయిన పువ్వులనండి, కూరగాయలనండి, శ్రీరామరాజ్యం hybrid variety.. సరుకు ఒక్కటే అయినా రుచిలో తేడా ఉండదూ మరి?

   అన్నిటిలోకీ ముఖ్యం 1963 లో 26 కేంద్రాల్లో మాత్రమే రిలీజు చేసి అన్నిటిలోనూ శతదినోత్సవాలూ, అందులో 16 కేంద్రాల్లో 175 రోజులూ ఆడిందిట. మరి శ్రీరామరాజ్యమో.. ప్రపంచం అంతా రిలీజు చేసి… ఎందుకులెండి..ఇంకా ఏమైనా అంటే బాగోదు...

    ఏదో శ్రీ బాపూ గారిమీద అభిమానం చేత సినిమా ఫరవాలేదనుకున్నాను కానీ, అసలు తేడాలు ఈవేళ తెలిశాయి…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్….

   ఏమిటో మమతా బెనర్జీకి “కోపం” వచ్చేసిందిట. అలిగి కూర్చుంది. రెండు మూడేళ్ళనుంచీ ఈవిడకిది అలవాటే.అదేదో FDI కుదరదంటుంది. పోన్లే ఇప్పటికి వదిలేద్దామూ అనుకుని, UPA ముందుసారి సరే అన్నారు.కానీ ఈసారి మాత్రం, “రోజూ పోయేవాడికి ఏడ్చేదెవరూ..” అనుకున్నారేమో ఏమిటో,నీ దిక్కున్నచోట చెప్పుకో ఫో అనేసి, ఆ FDI, Disel price, Subsidy on LPG మొత్తం మూడింటికీ ఒకే రోజు కొత్త policy చేసేశారు. రోజుకోటి చేయడం కంటే ఇదే హాయి కదా. వచ్చే గొడవలన్నిటికీ, Bandh లూ,ధర్నాలూ, దిష్టి బొమ్మలు అంటించుకోడాలూ,టీవీ ల్లో చర్చలూ all under one roof లా అదేదో single window లో చేసేసికోవచ్చు. ఖర్చులైనా కలిసొస్తాయి !!

   ఈవేళ భారత్ బంద్ అన్నారు. పోనీ దాంట్లోనైనా unity ఉందా అంటే అదీ లేదు.మమతా అన్ని కబుర్లూ చెప్పి, ఠాఠ్ బెంగాల్లో బందుండదూ అంది.వాళ్ళెవరో చెప్పారూ, మనం చేయడం ఏమిటీ అనుకుని.అసలు ఈ గొడవంతా ప్రారంభించింది తనే కదా. అలాగని, పెట్రోలు బంకులకెళ్ళడం మానేశారా, అదీ లేదూ.పెట్రోల్ రేట్లు ఈ మూడేళ్ళలోనూ, లెఖ్ఖలేనన్నిసార్లు పెంచారు. ప్రతీ సారీ రాజకీయ పార్టీలు ఒకటే slogan… “Roll back.. otherwise..”- అంటూ.ఏం చేశారుట? ప్రభుత్వమేమో, వాళ్ళ దారిన వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళకీ తెలుసు, ఊరికే కబుర్లు చెప్పడం కాదూ, ఏ పార్టీ power లో ఉన్నా కానీ, ఇలాటివి తప్పవూ, ఛస్తారేమిటీ, డబ్బులెక్కడినుంచొస్తాయీ? ఈ protest లూ అవీ ఓ కాలక్షేపం (ఉత్తుత్తినే..).

   పోనీ అంత నచ్చకపోతే, ప్రభుత్వాన్నేమైనా దింపేస్తారా అంటే అదీ లేదూ. మజాకా ఏమిటీ, గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు recoverచేసికోకుండా, మళ్ళీ ఎన్నికలంటే మాటలాఏమిటీ? ఎవడబ్బ ఇస్తాడూ? దీనితో ఏమౌతుందీ, ఏదో ఓ పార్టీ వాడు, ప్రభుత్వానికేమీ ఫరవాలేదూ, మేము outside support ఇస్తామూ అంటారు. ఇదో భాగవతం. పాత కేసులో, ఏవో మళ్ళీ తెరిచి, “vote for Government or...” అని ఓ వార్నింగిచ్చేస్తే నోరుమూసుకుని కూర్చుంటారు. ప్రతీవాడూ black mailచేసేవాడే.ఈ mixed masaalaa ప్రభుత్వాల్లో ఉండే గొడవే ఇది. అప్పుడెప్పుడో, మన “సహస్రఫణ్” నరస్ంహరావుగారు చూడండి, అయిదేళ్ళూ మైనారిటీ ప్రభుత్వమే నడిపారు.ఎవడెలా అనుకున్నా పట్టించుకునేవారు కాదు, ఎప్పుడైనా గొడవొచ్చినా నాలుగైదు” సూట్ కేసులు” పంపించేసి, “పని” కానిచ్చేసేవారు.పోనీ అలాగని historical events జరగలేదంటారా, economic reforms, Babri Masjid ఆ రోజుల్లోనే కదా. అదీ ” తెలుగు తేజం” power(దమ్ము) అంటే. అప్పటి మనిషే కాబట్టి, మన్మోహన్ గారూ, హాయిగా ” నిర్వికారంగా” తన పనేదో తను చేసేస్తున్నారు. మహా అయితే ఏమౌతుందిట, ప్రధానమంత్రిత్వం పోతుంది. పీడా వదుల్తుంది, ఎలాగూ “ ఆవిడెవరో” చెప్పిందే చేయాలీ, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు.

   రామాయణం లో పిడకల వేట లాగ, ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంటవగానే ఆయన సీటుకి ఆయన కొడుక్కిచ్చేద్దామనుకున్నారుట, సంబంధాలు బావున్న రోజుల్లో “దీదీ” “OK dont worry..” అందట. ఇప్పుడేమో పరిస్థితుల ప్రభావం కారణంగా,కుదరదనేసరికి ప్రణబ్ గారి కొడుకు ఆయనెవరో అభిజీత్ ముఖర్జీట, ఆయనకి గుండెల్లో రాయి పడింది. వాళ్ళబాబేదో చేస్తూన్నాడుగా, మళ్ళీ ఇంకోడెందుకూ? ఏమిటో “పీత కష్టాలు పీతవీ..”.మన దేశంలో ఇదో హాయి, తల్లి ప్రెశిడెంటు కొడుకేమో మహరాష్ట్రఅసెంబ్లీ సభ్యుడు, తండ్రి ప్రెశిడెంటు కొడుకు already బెంగాల్ సభ్యుడేట, అయినా తండ్రికి దగ్గరగా ఉండొద్దూ అందుకోసం అన్నమాట.మొగుడేమో ముఖ్యమంత్రీ, భార్యేమో ఎంపీ. They can happen here only... ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదూ..ప్రతీవాడూ dynastical rule ఉండకూడదనేవాడే, వాళ్ళెవరో చేస్తే తప్పా, మరి ఈ ప్రబుధ్ధులుచేస్తున్నదేమిటంటా?

   ఇవన్నీ ఒకవైపూ, IIM B వాళ్ళు అదేదో course ప్రారంభించేరుట ” Professional politicians” కోసం. ” చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు” దీనికి కూడా ఓ కోర్సా !! చేతిలో డబ్బులున్నవాళ్ళందరూ పొలోమంటూచేరిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఉధ్ధరించేదేమిటో చూడాలి.

    పేద్ద హడావిడి చేసేసి ధర్నాలన్నారు, దీక్ష లన్నారు, ఉపోషాలన్నారు, నెట్ లో ఆసక్తున్నవాళ్ళందరూ అవేవో group లన్నారు, ఒకటేమిటి హోరెత్తించేశారు ఏడాదిపాటు. చివరకి పార్టీ పెట్టేయాలన్నారు. ” మాకు మాత్రం తెలియదా ఏమిటీ..” అంటూ మిగతా రాజకీయనాయకులూ అన్నారు, Team Anna ఎత్తేశామన్నారు, అయినా మాకూమాకూ అభిప్రాయ బేధాలే లేవుపొమ్మన్నారు, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ తన పేరెక్కడ ఉపయోగించేసికుంటారో అని అన్నా హజారే గారు, తన పేరుకీ, ఫొటోకీ ఓ Patent/ Copy right పెట్టేసికున్నారు ఈవేళ.

    ఈ మధ్యలో మళ్ళీ అదేదో World Cup ట ప్రారంభం అయింది కొలొంబో లో. అప్పుడెప్పుడో ODI లో నెగ్గడం, అతనెవరో “అతని” కోసమైనానెగ్గి తీరాలీ అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమో “ఇంకో అతని” నెగ్గితీరాలీ అనుకుని డిసైడైపోయిందిట మన టీమ్. Great.. Great... వాడెవడిగురించో అనేకానీ, అంతమంది జనాభా వెర్రివెధవల్లాగచూస్తున్నారూ, పోనీ ” దేశం కోసం” ” భారతీయుల కోసం” అనాలని ఒక్కడికైనా తోచిందా. అబ్బే. ఎవడిగోల వాడిదే.. And we glorify these fellows and waste our time..

    ఈమధ్యలో మన నాయుడు గారు “పాదయాత్ర” మొదలెట్టారుట. అదీ 121 రోజులుట. అదో కాలక్షేపం. ఆ జగన్ మోహన రెడ్డి ఓదార్పు యాత్రలన్నాడు, జైల్లో కూర్చున్నాడు. ఏదో మొదటి సారే novel గా ఉంటుంది. అప్పుడెప్పుడో YSR చేశాడంటే, ముఖ్య మంత్రి అయ్యారూ,కొడుక్కి అన్నీ చేశాడూ, మధ్యమధ్యలో ప్రజలక్కూడా ఏదో విదిలించారు కాబట్టి, ఆ చేసిన పుణ్యం ధర్మమా అని, ” నల్లమలై” కొండల్లో, శ్రీశైల ప్రాంతంలో వెళ్ళిపోయాడు.

   అసలు గొప్పదనంతా ఏమిటంటే inspite of all these.. దేశంలో ఇంకా మనకి రోజులెళ్తున్నాయి… అందుకే “మేరాభారత్ మహాన్…”

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Ignorance is bliss….

    చిన్నప్పుడే హాయిగా ఉండేది. ఏదో ఇంట్లో నాన్నగారో,అమ్మో, అమ్మమ్మ గారో చెప్పేది వినడం, ఆహా..ఓహో.. అనుకోడం. ఏ సమస్యలూ లేకుండా వెళ్ళిపోయేది.ఆ తరువాత స్కూల్లో చేర్పించిన తరువాత, ఆ మాస్టారు చెప్పిందేదో వినడం, పద్యాలూ, పాఠాలూ బట్టీ పట్టేయడం, ఓ గొడవొదిలిపోయేది. జీవితం అంతా అలాగే వెళ్ళిపోతే జివితం అని ఎందుకంటారూ. మా అమ్మమ్మగారనే వారులెండి.. ఎవరైనా స్నేహితులద్వారా ఏదైనా విని, అది మంచి వార్తైతే పరవాలేదనేవారు.ఖర్మం చాలక అదేదో దుర్వార్తలాటిదైనా, ఇంకోటేదైనా అయితే ” ఎందుకురా దరిద్రపు వార్తలన్నీ మోసుకొస్తావూ.. పై దేవతలు తథాస్తూ అంటారనేవారు.అలా ఏదో మంచి వార్తైతేనే వినే అలవాటైపోయింది. బహుశా positive vibes ఉండాలని అలాగనేవారేమో. ఏదైతేనే “రాముడు మంచి బాలుడు” లాగ గడిచిపోయింది, బాల్యమంతా..

కానీ కాలేజీకొచ్చేసరికి వెర్రితలలు వేయడం మొదలవుతుందిగా, కొద్దిగా ప్రపంచం అంటే తెలియడం ప్రారంభం అయింది. కాలేజీ తరువాత వెంటనే ఉద్యోగమొకటాయే, ఇంక నన్ను పట్టేవాడెవరూ?పైగా చేతికందనంత దూరమోటీ. ఇంట్లో తల్లితండ్రులు మా అబ్బాయి చాలా బుధ్ధిమంతుడూ, నోట్లో వేలెడితే కొరకలేడూ అని ఓ పెద్ద impression ఒకటి పెట్టేసికున్నారు. మరీ, వాళ్ళని disappoint చేయడం ఎందుకులే అని నేనూ almost అదే మార్గంలోనే వెళ్ళానులెండి.అలాగని మరీ సుధ్ధ మొద్దావతారం అనికాదూ, కొద్ది కొద్దిగా చుట్టూ ఉండే ప్రపంచం తెలిసికోవడం మొదలెట్టాను,పుస్తకాలూ, పత్రికలూ, సినిమాలూ లాటి pure non vegetarian మెనూతోనేలెండి. ఫ్రెండ్సెవరైనా ఫలానాది తెలియదా అన్నప్పుడు మాత్రం కొద్దిగా అరే అలా కూడా ఉంటారన్నమాట అని అనుకునేవాడిని.

ఎప్పుడైనా, ఎవరికైనా ఒక particular వయస్సులో మన చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. Fortunately నా స్నేహితులూ చాలామంది నా so called అమాయకత్వం చూసి, మరీ ఎక్కువగా చెప్పేవారు కాదు. Ignorance is bliss అనుకునేవాడిని. అయినా ఎన్నాళ్ళిలా సాగుతుందీ? పెళ్ళీ, పిల్లలూ సంసారం వచ్చిన తరువాత కూడా అలాగే ఉంటానంటే కుదరదుగా. పైగా భార్యకీ, పిల్లలకీ మనమేమో అదేదో role model లాగ ఉండాలిట, అదో గొడవా...అందువలన ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు ప్రపంచం లో జరిగే ప్రతీ విషయం, పూర్తిగా తెలిసికోలేకపోయినా, కనీసం తెలుసున్నట్టు pose పెట్టవలసొచ్చేది.ఏదో వీధిన పడకుండా లాగించేశాననుకోండి, బహుశా మా ఇంటావిడా, పిల్లలూ నన్ను సరీగ్గానే estimate చేసుంటారు. ఈయన్ని అల్లరి పెట్టడం ఎందుకులే అనైనా అనుకునుండొచ్చు. ఏది ఏమైతేనే నన్నెప్పుడూ ఇరుకులో పెట్టలేదు.వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడ్డారు. నా పాత టపాల్లో ఎప్పుడో చెప్పాను, ఈ చదువులూ చట్టుబండలూ నన్నడక్కుండా ఉంటే, వాళ్ళకి కావలిసినవన్నీ చేస్తానూ అని ఒప్పేసికున్నాను. పిల్లల దగ్గర సిగ్గెందుకూ? ఇంటావిడకైతే మొదటి ఆరు నెలల కాపరంలోనే తెలిసిపోయింది.నా ప్రాణానికీ హాయిగా ఉండేది.

తరువాత పిల్లల పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ.. వాటికేమీ మనం ఓ పెద్ద intellectual అవఖ్ఖర్లేదు. ఏదో సాదా సీదా తెలివితేటలు చాలు, ఆ మాత్రం ఉన్నాయిలెండి.ఇన్నాళ్ళూ గడిచిన జీవితంలో మనకున్న పుస్తకాలనండి, ప్రసార సాధనాలనండి, ఎంత చెప్పినా limited గానే ఉండేవి.వాటికి సాయం, మనం చిన్నప్పుడు నేర్చుకున్నవీ, అక్కడా ఇక్కడా విన్నవైతేనేమిటి, ప్రతీ విషయం మీదా, ప్రతీ వ్యక్తిమీదా ఓ అభిప్రాయం నాటుకుపోయుండేది.మధ్యలో ఇంకోరెవరైనా( మనకంటే ఎక్కువ చదువుకున్నవాడవొచ్చు, అనుభవం ఎక్కువున్నవాడవొచ్చు) చెప్పినా సరే ఒప్పుకోకపోవడం. ఇదొకటి మాత్రం అబ్బింది, ” సిరి అబ్బదు కానీ, చీడ అబ్బుతుందిట” ..అలా ఉంది. పోనీ అవతలివాడేదో చెప్తున్నాడూ, ఓసారి వినేస్తే పోలా అనిమాత్రం అనుకోకపోవడం!

మొత్తానికి అన్ని ఆశ్రమాలూ దాటి వానప్రస్థాశ్రమంలోకి వచ్చేసరికి లేనిపోని గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ internet ఒకటొచ్చింది. దాని దారిన దాన్ని వదిలేస్తే పోయేదిగా, అబ్బే నేర్చేసుకోవాలీ, మనంకూడా moving with times లా ఉండాలీ అనుకోడం. ప్రతీదీ తెలిసికోవాలనే కోరికా, ఎందుకు చెప్పండి ఈ వయస్సులో ఈ వేషాలన్నీ. హాయిగా ఓ పేపరోటి కొనుక్కుని, అబ్బాయి లైబ్రరీకి వెళ్ళి, ఏ పుస్తకమో (అదీ లైట్ గా ఉండేది) చదువుకుని, ఇంటావిడ చేసిన కందా బచ్చలి కూరా, గోంగూర పచ్చడీ, మావిడి ఒరుగులతో పప్పూ, తోటకూర పులుసూ ( ఈవేళ్టి మెనూ!!) తిని హాయిగా పడుక్కోకా?

రాజమండ్రీ కాపరం దగ్గరనుంచీ “ప్రవచనాలు” వినడమోటి ప్రారంభం అయింది. ఆయనెవరో చెప్పడంతో నెట్ లో కూడా ఓ నొక్కు నొక్కితే ప్రత్యక్షం అవుతున్నాయి. వీటికి సాయం ఈ టీవీ లోటీ.ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారు. ఎవరిది వినాలో తెలియదు. ఎవరు చెప్పింది రైటో తెలియదు. ఇవన్నీ కాకుండా, మా ఇంటావిడేమో ఫలానా స్కాంద పురాణం లో ఇలా ఉందీ, శివ పురాణం లో ఇలా ఉందీ ఇంకో పురాణం లో ఇలా ఉందీ అంటూ ఒకే రోజులో నన్ను confuse చేసేయడం!ఏమిటో ఇదివరకే హాయిగా ఉండేది..

అలాగే ఇన్నాళ్ళూ మనకి ఏదో వ్యక్తి మీద ఉన్న అభిప్రాయ విషయంలోనూ అలాగే. ఒక్కో పేపరు వాడు ఒక్కోలా.. ఒక్కో చానెల్ వాడు ఒక్కోలా.. ఏమిటో అంతా గందరగోళం..అందుకే అన్నాను ignorance is bliss... అని !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Happiness in sharing.. లో ఉన్నమజా ఒకసారి తెలిసికోండి…

   నేను బ్లాగులు వ్రాయడం మొదట్లో english లో మొదలెట్టాను. కానీ తెలుగులో వ్రాయాలనే తపన మిగిలిపోయింది. కారణం పెద్దగా ఏమీ లేదూ, ఇంగ్లీషు భాష లో వ్రాసినవి, ఏదో మొహమ్మాటానికి, పిల్లలు చదవడం తప్ప పెద్ద trffic ఉండేది కాదు.మనకింతే ప్రాప్తం ఉందేమో అనుకుని వదిలేశాను. పిల్లల కంప్యూటరులో ప్రయోగాలు చేయాలంటే భయం, ఆ సిస్టం ఎక్కడ తగలడుతుందేమో అని ! పోనీ ఎవరినైనా అడుగుదామా అంటే, మనకి నేర్పే తీరికా ఎవరికీ ఉండేది కాదూ.

    చివరకి రాజమండ్రీ కాపరానికి వచ్చిన తరువాత, అబ్బాయి ఇచ్చిన desktop ధర్మమా అని, నాకు నేనే ఏదో కెలకడం ప్రారంభించాను. మహా అయితే ఏమౌతుందీ, పాడవుతుంది. మా ఇంటి ఓనరు గారి అబ్బాయి దగ్గరే తీసికోడం వలన, ఎప్పుడైనా కంప్యూటరు కి సుస్తీ చేసినా, వెంటనే attend అయ్యేవాడు. ఇంక నాకెందుకూ భయం… మొత్తానికి వెదికి ..వెదికి పుటుక్కున పట్టేశాను…http://type.yanthram.com/te/. అడిగిన వాడికీ, అడగనివాళ్ళకీ, నాకు తెలిసిన ఈ so called knowledge పంచుకోడం ప్రారంభించాను. మొదటి victim ఇంకెవరూ, మా ఇంటావిడే poor soul !

    ఈ లింకు ధర్మమా అని మొత్తానికి, మీ అందరి ఆదరాభిమానములతోనూ అందరినీ ” బోరు” కొట్టేస్తున్నాను. కానీ ఈ “యంత్రం” లో ఉన్న గొడవేమిటంటే, ఎక్కడో వ్రాసుకుని, copy paste చేయడం. ఈమధ్యలో కరెంటు పోయిందా గోవిందో.. గోవిందా … మళ్ళీ మొదలూ. ఈ బాధలన్నీ పడలేక, పోనీ ఏదైనా direct గా టైపుచేసికునే సదుపాయం ఉందా అని, గూగులమ్మని అడిగితే అవేవో font.. download.. set up.. installation.. అంటూ ఏవేవో వచ్చాయి. మనకా అన్ని తెలివితేటలా లేవాయే, పోనీ ఎవరినైనా అడుగుదామా అంటే, ఎవరికీ తీరికా లేదాయే. పోనీ, మన బ్లాగర్లనెవరినైనా అడుగుదామా అంటే,ఏవేవో లింకులు పంపుతారూ, ఎదురుగుండా ఉండి చెప్తేనే అర్ధం కాని, మట్టి బుర్రాయే నాదీ( ఈ విషయం అవతలివారికి తెలియదుగా పాపం !).

    వీటికి సాయం మధ్యమధ్యలో అవేవో వైరస్సులుట, వాటి ధర్మమా అని, నా కంప్యూటరు మొండికేసి, కూర్చునేది. వాడెవడో వచ్చి, వైద్యం చేసి మొత్తానికి బాగుచేసేవాడు. కానీ వాడు వెళ్ళీవెళ్ళగానే చూస్తే, యంత్రం బాగానే ఉండేది, కానీ, మిగిలినవన్నీ బాక్సుల్లా కనిపించెవి. వాడికి ఫోను చేస్తే, ఏదో చెప్పేవాడు. నా బాక్సుల్లో మార్పేమీ ఉండేది కాదు. మొత్తానికి వెదుక్కుని http://www.omicronlab.com/tools/icomplex-full.html అని ఒకటి పట్టుకుని, మొత్తానికి తెలుగు అక్షరాలు కనిపించేలా చేశాను. కానీ అవన్నీ గుర్తుండి ఛస్తాయా, మళ్ళీ కంప్యూటరు డౌనూ, నా వెదకడాలు ప్రారంభం…పనేమీ లెదు కాబట్టి పేద్ద గొడవేమీ లేదనుకోండీ…

    ఆ మధ్యన ఎవరినో అడిగితే ఏమిటేమిటో చెప్పారు, కావల్సొస్తే మార్కేట్ లో అదేదో తెలుగు కీ బోర్డు కూడా దొరుకుతోందన్నారు. ఇవన్నీ ఎవడిక్కావాలండి బాబూ, మళ్ళీ ఆ కీ బోర్డులో ఏ ఏ అక్షరాలు ఎక్కడెక్కడున్నాయో మళ్ళీ తెలుసుకోవాలి. ఏదో మామూలుగా వాడుతున్న కీ బోర్డులోనే హాయిగా, నాకున్న బుల్లి knowledge తో ఏదో తిప్పలు పడాలని కదా నాక్కావలిసినదీ, మళ్ళీ తెలుగు కీ బోర్డూ, ఫాంట్లూ గందరగోళం అంతా ఎందుకూ? “చదవేస్తే ఉన్న మతి పోయిందిట”-– అలాగ నాకొచ్చింది మర్చిపోతే ఎలాగా?

    ఇలా నా “వెదుకుడూ, కెలుకుడూ ” ప్రస్థానంలో మొన్న హారం లో ఓ టపా చూశాను. ఇదేదో మనకి పరిచయం ఉన్నట్టు కనిపిస్తోందే అనుకుని, తెరిచి చూశాను. అందులో చెప్పినట్టుగా చేయగానే ఇంకేముందీ..”యురేకా…” అని అరిచేశాను.ఇంక నా copy. paste.. ల గొడవోటి వదిలిందిరా బాబూ అనుకుని! తీరా ఆ టపా శీర్షికేమో wordpress కి అని ఉంది.మా ఇంటావిడేమో blogspot లో వ్రాస్తూంటుంది. పాపం అదేదో ఆవిడకీ రావద్దూ, అనుకుని ఆ కొత్త మాస్టారు శ్రీ చంద్రం గారికి ఓ మెయిల్ పంపాను, గురువుగారూ ( వయస్సెంతైనా గురువులే కదా..కొత్తదేదో నేర్పి పుణ్యం కట్టుకున్నారు..), మిగిలినవాటికి కూడా ” శాపవిమోచన మార్గం” ఉంటే చెప్పండీ అని. ఆయన వెంటనే స్పందించి జవాబిచ్చారు, వివరాలతో.

    “కోతికి కొబ్బరికాయ” దొరికినట్టుగా ఇంకేముందీ, ఆ లింకు డౌన్లోడ్ చేసేసికుని, ఒకటేమిటి, mail, chat,wordpad.,blogspot,wordpress.ఎక్కడపడితే అక్కడ హాయిగా రుచికరమైన అచ్చ తెలుగులో టైపు చేసేసి కుంటున్నాను. ఈ టపా అంతా అలా చేసిందే...

    పేద్ద గొప్పగా ఏమిటేమిటో చెప్తున్నారూ, ఇవన్నీ మాకు తెలియకనా అనొచ్చు. కానీ ఎంతమంది, శ్రీ చంద్రం గారిలా తనకు తెలిసినది ఎంతమందితో పంచుకున్నారూ? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా possessiveneస్సే కానీ, పోనీ ఇంకోళ్ళకీ ఉపయోగిస్తుందేమో అని ఆలోచించే మనస్సు ఎంతమందికుందీ అంట?

    అందుకే చెప్తూంటాను, మీకు తెలిసినదేదో ఇంకోరితో పంచుకుంటే ఉన్నంత ఆనందం ఎక్కడా లేదు.అలాగని మీ ఆస్థుల్ని అడగడం లేదు.. just knowledge only.. మీ అందరిలాగా మా వయస్సువారు కంప్యూటర్లతో పుట్టలేదు. ఏదో ఊరికే కూర్చుని అచ్చతెలుగులో వ్రాసుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళకేమైనా ఉపయోగించే చిట్కాలు చెప్తూ ఉండండి. మాకా బయట ఏదో Institute కి వెళ్ళి నేర్చుకుందామంటే సిగ్గూ, మొహమ్మాటం ” ఈ వయస్సులో ఇప్పుడు ఈయనకి ఇవన్నీ కావాల్సొచ్చాయా..” అని ఎవరైనా చెవులు కొరుక్కుంటారేమో అనీ. పోనీ మీ అందరిలాగా IITలు,B.Tech, MCA లూ కాదాయే. ఏదో వానాకాలం చదువులాయే…

    ఉన్న keyboard మార్చుకోనఖ్ఖర్లేదు.కొత్తగా typing అసలే అఖ్ఖర్లేదు. హాయిగా శ్రీ చంద్రం గారి టపాలో పెట్టినట్టుగా ఆ లింకులు నొక్కుకుని proceed… ఇంకో సంగతి మర్చిపోకండే… తెలుగునుంచి english లోకి మార్చుకోవాల్సినప్పుడు cntrl+3 నొక్కడం మాత్రం మర్చిపోకండి. లేకపోతే, మీ mails ఓపెన్ అవవు.నన్ను తిట్టుకుంటారు.. ఇంకా వివరాలు కావలిసొస్తే ఇదిగో ఇక్కడ చూడండి. తెలుగే కాదు, ఏభాషైనా, ఎక్కడైనా అరటి పండు వలిచి చేతిలో పెట్టుకున్నట్టే...

    అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే, తెలుగుభాష భ్రష్టు పడిపోతోందే అంటూ మీటింగులూ, కమెటీలూ, నడకలూ చేస్తారే కానీ ఇలాటివి ఉన్నట్టు ఇన్నాళ్ళూ ఒక్కరైనా చెప్పకపోవడం. నేను చెప్పిన సైటులోకి వెళ్ళి చూడండి, తమిళానికి ఎంత సేవ చేస్తున్నారో. మళ్ళీ తెలుగుకి “ప్రాచీన భాష” హోదా ఓటి వచ్చిందంటారు. ఇలాటి సులభమైన సాధనాలు ఉన్నట్టు చెపితేనే కదా అందరికీ తెలిసేదీ, ఉపయోగించేదీనూ…

    Thank you Chandram again...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Sandeep Maheswari

    నేను ఈ టపాలో వ్రాస్తూన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా విని ఉండకపోతే, సరదాగా ఓ గంటా యాభై నిముషాలు మీవి కాదనుకుంటే, ఒకసారి కింద ఇచ్చిన లింకు నొక్కండి. దాని దారిన అది వస్తూంటుంది, మీ పని మీరు చేసికోవచ్చు… సరేనా..
అలాగే ఇక్కడ కూడా ఒకసారి చూడండి…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” call you later….” syndrome.

   ఇదివరకటి రోజుల్లో అంటే, ఈ టెలిఫోను వ్యవస్థ ఇంత చేతికందీటట్టుగా ఉండనట్టి రోజుల్లో అన్నమాట, ఈ టపాకి పెట్టిన శీర్షిక ” call you later..” అనే రోగం మరీ అంత ఎక్కువగా ఉండేది కాదు.ఇప్పుడో చేతిలో సెల్ ఫోను లేనివాళ్ళు కనిపించడమే అరుదు.ఇదివరకు ఎప్పుడైనా ఎవరైనా ఫోను చేశారూ అంటే, దానికో పెద్ద కథా, కమామీషూ ఉండేది.టెలిగ్రాం కంటే, అత్యవసరపరిస్థితి వస్తేనే ఫోను జోలికెళ్ళడం.దానితో ఆ టెలిఫోనుకీ ఓ ప్రత్యేకమైన status లాటిదుండేది. పైగా ఆ రోజుల్లో ఫోన్లేమీ, ఇప్పుడు కాలేజీలూ, కోచింగు క్లాసులూ, కాన్వెంటులూ ఉన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కావు. మనగురించి ఎవరో ఫోనులో అడగడమే ఓ వింత, మనం ఫోను లో మాట్టాడడానికి వెళ్ళినట్టు ఊరుఊరంతా తెలిసేది. మరీ తెలియకపోయినా, మనమే దారేపోయేవాడికి చెప్పుకోడం… ” ఈవేళ మా అబ్బాయి ఫోను చేశాడండీ..” అంటూ. మనకి ఫోనెస్తే అసలు వాడికెందుకూ చెప్పుకోవడం… అదో status symbol అన్నమాట.

    ఆ గొడవొదిలేయండి, ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. ప్రస్తుతానికి వద్దాము. పైనే చెప్పినట్టుగా, చేతిలో ఫోను లేనివాడిని ఓ “విచిత్ర పక్షి” లా వింతగా చూసే రోజులాయె ఇప్పుడూ. దీనికి సాయం ఈ కాలం పిల్లలు ఇంట్లో ఉండే తల్లితండ్రులకీ, అత్త మామ లకీ కూడా లేటెస్ట్ ఫోన్లు చేతిలో పెడుతున్నారు. చేతిలో ఊరికే పెట్టుకుని కూర్చోలేరుగా, పిల్లలు ఆఫీసులకీ, మనవళ్ళూ మనవరాళ్ళూ స్కూళ్ళకీ వెళ్ళిన తరువాత, పెద్దగా పనేమీ ఉండదు. ఏమిటి చేయడం? ఎవరో ఒకరికి ఫోను చేసి బాతాఖానీ వేసికోడం, దానికి అంతుండదు. బిల్లేమైనా కట్టాలా ఏమిటీ? అలాటివన్నీ కొడుకో కోడలో చూసుకుంటారు.

    అలా కాకుండా, ఒకే ఊరిలో పిల్లలొకచోటా, తల్లితండ్రులింకో చోటా ఉన్నప్పుడు, మరోలా ఉంటుంది. తండ్రికి పెద్దగా ఉండదు పిల్లలతో ప్రతీ రోజూ మాట్టాడాలని, పేద్ద కారణం ఏమీ కాదూ.. ఎప్పుడు కావల్సొస్తే అప్పుడు వెళ్ళి చూసొచ్చేస్తాడు . కానీ ఇంట్లో ఉండే అమ్మకలాకాదుకదా రోజులో కనీసం ఒక్కసారైనా కొడుకు గొంతుక వినాలనుకుంటుంది. కొడుకా ఆఫీసుకెళ్ళాలాయే,ఎలాగా మరి? పోనీ కోడలుకి ఫోను చేసి యోగక్షేమాలు అడుగుదామా అనుకున్నా, పోనీ అదేదో కొడుకు ద్వారానే వినేస్తే, వాడి గొంతుక విన్నట్టూ ఉంటుందీ అనుకుని, కళ్ళజోడు పెట్టుకుని, వాడి నెంబరు నొక్కుతుంది. ఈవిడకంటే పెద్దగా పనీ పాటా లేదు కానీ అవతల అలా కాదుకదా! ఏదో మీటింగులోనో, ఎవడో client తోనో బిజీగా ఉంటాడు.మధ్యలో పీ..పీ.. అంటూ సౌండూ, ఈ అమ్మగారి కాల్ అన్నమాట.మొత్తానికి తను ఎటెండవుతున్న కాల్ పూర్తిచేసేసరికి missed call -amma అనుంటుంది. ఇంకా చాలామంది “అమ్మ” అనే అంటున్నారులెండి, అదో అదృష్టం.ఎక్కడికక్కడే!!!

   ఓసారి ఫోను చేద్దామని ప్రయత్నిస్తే ఇక్కడేమో ఈవిడ బిజీ.మీటింగులో ఉన్నప్పుడు మళ్ళీ ఆవిడదగ్గరనుంచి ఫోనూ.. ఓసారి excuse meeeeee.. అని చెప్పుకుని, బయటకు వెళ్ళి, తీరా ఫోను ఆన్సరు చేస్తే, ఆవిడ అడిగేదేమిటీ..” ఎలా ఉన్నావు నాయనా.. అదేమిటో రోజులో ఓసారైనా నీ గొంతుక వినకపోతే తోచదురా కన్నా…” అంటూ.”ఇప్పుడు మీటింగులో ఉన్నానూ… తరువాత కాల్ చేస్తానులే.. ” అని పెట్టేస్తాడు. దీన్నే “ call you later….” syndrome అంటారు…

    ప్రొద్దుటనుంచీ అలసిపోయి, ఇంటికి వచ్చిన తరువాత ఆ కొడుక్కి గుర్తూ ఉండదూ, ఆ తల్లి కూడా ఏదో ఒకటీ పిల్లాడి గొంతుక ఓసారి వినేశాను కదా అని ఆవిడా ఫోను చేయదూ. మళ్ళీ మర్నాడు సీన్ రిపీట్.. ఏదో నాలుగైదు సార్లు ఫరవా లేదు కానీ, ప్రతీ రోజూ అమ్మ దగ్గరనుండి ఫోన్లేమిటీ, అదీ గొంతుకవినాలనీ అనుకుని, ఆరోసారి ఫోను రింగయినా, అదీ అమ్మదగ్గరనుంచే తెలిసినా ఆ ఫోనెత్తడు రోజూ ఉండేదేకదా.. అని. అంతేకానీ, రోజులో ఏదో ఒకసారి ఫోను చేసేస్తే, ఆ వెర్రితల్లి సంతోషిస్తుందనిమాత్రం తట్టదు.Thats life… చివరకేమౌతుందంటే, ఏదో emergency వచ్చి ఫోను చేసినా ఇదే తంతు. అదేదో ” నాన్నా- పులీ...” కథలోలాగ ! అసలు ఈ ఫోన్లవల్లే వచ్చిందీ గొడవంతా, అసలు ఆ ఫోన్లే లేకపోతే, ఆవిడకి ప్రతీరోజూ కొడుకు గొంతుక వినాలనీ ఉండదూ, వాడు మాట్టాడలేదనే బాధా ఉండకపోను.పోనీ ఫోన్లొచ్చాయండీ, ఎగరేసికుంటూ ఇంట్లో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఫోన్లెందుకూ? ఈవిడేమో ఊరికే బాధపడిపోవడం, ఫ్రెండు దగ్గర గోడు వెళ్ళబోసుకోడం–“ అదేమిటోనండీ, అడ్డాలనాడు బిడ్డలు కానీ.….” అంటూ సాగదీసుకుంటూ..” మావాడి పలుకే బంగారం అయిపోయిది, ఎప్పుడు ఫోను చేసినా మాట్టాడ్డానికే టైముండదంటాడూ… మన వాళ్ళు ఉద్యోగాలు చేయలేదా… వాళ్ళ తల్లితండ్రుల్ని చూసుకోలేదా... ఏమిటో….” అంటూ.వీళ్ళ ఫ్రెండో సలహా ఇచ్చేస్తుంది..” మీరు మరీ ప్రతీ రోజూ చేస్తే అలాగే ఉంటుందీ, పాపం వాళ్ళకీ పనులుంటాయి కదా, ముందరలో నేనూ అలాగే బాధపడేదాన్ని, తరువాత్తరువాత అలవాటైపోయింది. ఎప్పుడో వాళ్ళకి అవసరమైనప్పుడే ఫోన్లు చేస్తారు. ఫోను రాలేదూ అంటే అంతా బావున్నట్టే అన్నమాట, ఏం చేస్తాం, కాలంతోపాటు మనమూ మారాలీ...”అంటూ..నిజమే కదా మరి.ఆడపిల్లగా పుట్టినప్పటినుంచీ ప్రతీ దాంట్లోనూ compromiజులే అలవాటైపోయాయి, ఇదీ అలాగే. పిల్లలకి బుధ్ధిపుట్టినప్పుడే పండగ అనుకోడమూ, ఓ దండం పెట్టుకోవడం, మనకింతే ప్రాప్తం అనుకుని.
పైన చెప్పిందంతా పిల్లలకీ, తల్లితండ్రులకీ మధ్యనుండేది. ఈ మధ్యన ఎవడో ఒకడు ఫోను చేయడం, మాది అదేదో insurance ఉందీ, ఇంకో scheme ఉందీ అంటూ. అసలు వీళ్ళందరికీ ఇంకో పనేమీ ఉండదా అనిపిస్తూంటుంది. ఏదో సెల్లు కొనుక్కున్న మొదట్లో, కాల్స్ తీసికోడం బాగానే ఉండేది. ప్రతీ రోజూ ఇదేం సంతా అనుకుని, I will call you back అనేయడం. పోనీ వాడూరుకుంటాడా, నేనే మళ్ళీ కాల్ చేస్తానూ, ఎప్పుడు మీకు వీలుగా ఉంటుందో చెప్పండీ అంటూ పట్టువదలని విక్రమార్కుడి లా వదలడు.

    మా లైబ్రరీ ఉందని చెప్పానుగా, ఆమధ్యన ఎవరో నా ఫ్రెండు, వారి తమ్ముడి ఫోను నెంబరిచ్చారు.సరే తెలుగువారే కదా అని, ఫోను చేసి వివరాలు చెప్పాను. మర్నాడు మా లైబ్రరీ సైటులోకి వెళ్ళి చూస్తే తెలిసింది సైను చేసి ఫోను నెంబరిచ్చినట్టుగా. పోనీ బాగానే ఉందీ అనుకుని, మా అబ్బాయితో ఓ వారం పోయిన తరువాత చెప్పాను, ఫలానా వారికి ఫోనుచేయించూ అని. వాళ్ళ ఆఫీసులో ఉండే అమ్మాయి ఫోనుచేస్తే… “I will call you back..” అని పెట్టేశాడుట. ఇంకో వారంపోయిన తరువాత ఈవేళ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అడిగాను, సభ్యత్వం తీసికున్నాడా అని. లేదూ ఇంకా తన దగ్గరనుంచి ఫోన్నే రాలేదూ అని తెలిసింది.అదేదో ముందే చెప్పేయొచ్చుగా, మీ ,లైబ్రరీ లో చేరడం నాకు అంత ఆసక్తి లేదూ అని. ఇదేమీ insurance వాళ్ళ ఫోను కాదే.వీళ్ళు ఫోను చేసినప్పుడా “I will call you back..” అనడం. పోనీ తనే చేస్తాడా అంటే అదీ లేదూ. “Leave it..” అని చెప్పాయాల్సొచ్చింది. ఇలాటి ప్రాణులూ ఎదురవుతూంటారు ఒక్కొక్కప్పుడు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఏదో రాఘవేంద్రరావు సినిమా కదా, నాగార్జున నటించిన “అన్నమయ్య” దృష్టిలో పెట్టుకుని, కీర్వాణి సంగీతం బాగుంటుందీ, అనుకుని ఎన్నో expectations పెట్టుకుని, షిరిడీ సాయి సినిమాకి మొదటిరోజు పన్నెండు గంటల షోకి వెళ్తే, థియేటరు లోంచి బయటకు, ఓ పెద్ద disappointment తో వచ్చాను. గ్రాఫిక్స్ తో ఒక డాక్యుమెంటరీ చూసినట్టుంది కానీ, ఏదో దృశ్యకావ్యం చూసిన అనుభూతిమాత్రం కలగలేదు. మొత్తం సినిమాలో నాకు నచ్చినవి బాపూ గారు దత్తాత్రేయ అవతారానికి సృష్టించిన చిత్రాలు మాత్రమే.

    కామెడీ పేరుతో సినిమా చివరికంటా శాయాజీషిందే, ఆలీ పెట్టిన హింస, అదీ డాల్బీ సౌండులో..అడక్కండి… ధర్మవరపు సుబ్రహమణ్యం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అంతకంటే, బ్రహ్మానందం ఇచ్చిన పాత్ర చిన్నదే అయినా, డయలాగ్గులు బావున్నాయి.

    నాగార్జున pre release interviews చెప్పుకున్నట్టు ఇదేమీ, తన most unforgettable పాత్ర ఏమీ కాదు! అన్నమయ్య లో నటించిన అంశ అడుగడుగునా కనిపిస్తుంది. ఇక్కడ తేడా ఏమిటీ అంటే, సాయిబాబా మేకప్పు- రాఘవేంద్రరావు పోలికలతో !! మరీ అంత obvious గా ఉండాలంటారా?
సినిమా ప్రపంచం అంతా రిలీజు చేయడం వల్లనైతేనేమిటి, సాయిబాబా పేరులోని మహిమ అయితేనేమిటి, డబ్బులు మాత్రం వస్తాయి. రెండోసారి చూస్తారనిమాత్రం అనుకోను, ఎంత “షిరిడీ సాయి” పేరుతో సినిమా అయినా.

    లోకోభిన్నరుచి… ఎవరిష్టం వారిదీ….